ఖమ్మం వార్తలు

సిపిఐ 100 సంవత్సరాల పండుగ… వేదిక కానున్న ప్రభుత్వ కళాశాల గ్రౌండ్

సిపిఐ శత వసంతాల వేడుక వేడుకకు సిద్ధమవుతున్న ఖమ్మం

సభా స్థలిని పరిశీలించిన సిపిఐ నాయకులు

భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు సందర్బంగా ఈనెల 18న బహిరంగ సభ జరగనున్న

ఎస్ఆర్అండ్్బజిఎస్ఆర్ కళాశాల మైదానాన్ని శుక్రవారం సిపిఐ నేతలు పరిశీలించారు. సభా వేదిక, కళాకారుల వేదిక నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. కళాశాల మైదానం మొత్తం పరిశీలించి వాలంటీర్లకు తగు బాధ్యతలు -అప్పగించారు. సభా స్థలికి హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రాకపోకలకు అంతరాయం కలుగకుండా భారీకేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు తెలిపారు. సభాస్థలిని పరిశీలించిన వారిలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులు యర్రాబాబు, కొండపర్తి గోవిందరావు, బిజి క్లెమెంట్, మేకల శ్రీనివాసరావు, పోటు పూర్ణ, చింతల రమేష్, నంబూరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మధిర నియోజకవర్గంలో ప్రతి చెట్టూపుట్ట చెపుతుంది … భట్టి ఏమిచేశాడో అన్న విక్రమార్కుడు

Ram Narayana

మంత్రి తుమ్మల ముందుచూపు … ఖమ్మంకు మహర్దశ…

Ram Narayana

పామాయిల్‌లో అంతర పంటగా పసుపు, మంత్రి తుమ్మల ప్రయోగం సూపర్‌ హిట్..

Ram Narayana