ఖమ్మం వార్తలు

12న నూరేళ్ల అరుణ కేతనం ఆవిష్కరణ

12న నూరేళ్ల అరుణ కేతనం ఆవిష్కరణ

-అతిథిగా హాజరుకానున్న సుద్దాల అశోక్ తేజ, కూనంనేని

భారత కమ్యూనిస్టు శత వసంత ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ప్రత్యేక కవితా సంచిక నూరేళ్ల అరుణ కేతనంను ఈనెల 12న ఆవిష్కరించనున్నట్లు కమిటీ బాధ్యులు లెనిన్ శ్రీనివాస్ తెలిపారు. కవితా సంచిక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ప్రముఖ అభ్యుదయ, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరుకానున్నారని లెనిన్ శ్రీనివాస్ తెలిపారు. కవితా సంచిక ఆవిష్కరణకు సంబంధించి శుక్రవారం ఏఐటియుసి కార్యాలయంలో శింగు నర్సింహారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని అభ్యుదయ రచయితల నుంచి రచనలను ఆహ్వానించామని వంద మంది కవులు తమ రచనలను పంపించారని పరిశీలన అనంతరం వాటిని అరుణ కేతనంలో ముద్రించడం జరిగిందన్నారు. 12న ఉదయం 10 గంటలకు ఖమ్మం డిపిఆర్సి భవనంలో కవి సమ్మేళనం జరుగుతుందని సమ్మేళనంలో పుస్తకావిష్కరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో -నవచేతన విజ్ఞాన సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఖమ్మం జిల్లాకు చెందిన కవులు మువ్వా శ్రీనివాసరావు, రౌతు రవి, కొంపల్లి రామయ్య, రవి మారుత్, ప్రసేన్, సీతారామ్, ఐవి రమణారావు తదితరుల పాల్గొంటారని లెనిన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, ఐజెయు జిలా -అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు, శింగు నర్సింహారావు, సిహెచ్ సీతామహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్యాయం చేయవద్దు…ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్!

Ram Narayana

ఆందోళనలు .. ట్రాఫిక్ జామ్ , అరెస్టులతో అట్టుడుకిన ఖమ్మం ….

Ram Narayana

నాన్నను కట్టిపడేసిన పాలేరు ప్రజల ప్రేమ …కుమార్తె దీప్తిరెడ్డి…

Ram Narayana