తెలంగాణ వార్తలు

ఏబీఎన్ ఛానల్ ,న్యూస్ ను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ యస్ ప్రకటన ..

  • ఏబీఎన్ ఛానెల్ చర్చల్లో పాల్గొనబోమని బీఆర్ఎస్ ప్రకటన
  • ఎమ్మెల్సీ రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ప్రతినిధి తీరుపై నిరసన
  • పార్టీ కార్యాలయాల్లోకి ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి ప్రవేశం లేదని స్పష్టం
  • గతంలోనూ ఆంధ్రజ్యోతి వైఖరిపై బీఆర్ఎస్ ఆరోపణలు

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏబీఎన్ ఛానెల్‌లో జరిగే చర్చా కార్యక్రమాల్లో తమ పార్టీ నేతలు పాల్గొనరని, అలాగే తమ పార్టీ కార్యాలయాల్లోకి ఆ సంస్థ ప్రతినిధులను అనుమతించబోమని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల ఆంధ్రజ్యోతి అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఉందని కూడా పార్టీ ఆరోపించింది.

ఈ నేపథ్యంలోనే పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌తో పాటు, జిల్లా కార్యాలయాల్లో జరిగే సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రతినిధులను అనుమతించరాదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో బీఆర్ఎస్, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.

Related posts

మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదు …సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

మేడారం జాతర తేదీలు ఖరారు .. జనవరి 28 నుంచి మహా వేడుక!

Ram Narayana

ఈ నెల14న భూభారతి చట్టం ప్రజలకు అంకితం – మంత్రి పొంగులేటి

Ram Narayana