తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ!

  • మాధవ్ నగర్ ఆర్ఓబీకి సవరించిన రూ.8.68 కోట్లు మంజురు చేయాలని కోరినట్లు వెల్లడి
  • తక్షణమే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్న ఎంపీ
  • మంత్రి సానుకూలంగా స్పందించారంటూ ధన్యవాదాలు తెలిపిన అరవింద్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన ఒక పని నిమిత్తం తాను మంత్రిని కలిశానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన విషయాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

గత 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాధవ్ నగర్ ఆర్ఓబీ 193కి సవరించిన అదనపు రూ.8.68 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశానని ఆయన పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తక్షణమే మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని వెల్లడించారు.

Related posts

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మా పార్టీ పని చేస్తుంది: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

Ram Narayana

ఖమ్మంలో జరిగే సిపిఐ వందేళ్ల ఉత్సవాలకు అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి …

Ram Narayana

కేటీఆర్ కు ఖమ్మంలో గ్రాండ్ వెల్కమ్ …

Ram Narayana