- గన్నవరం విమానాశ్రయంలో ఒకరికొకరు తారసపడ్డ జగన్, బ్రహ్మానందం
- ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్న వైనం
- గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కలిశారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఈ అరుదైన కలయిక చోటు చేసుకుంది. బెంగళూరుకు వెళ్లేందుకు జగన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఒక పని మీద గన్నవరం చేరుకున్న బ్రహ్మానందం ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. బ్రహ్మానందం యోగక్షేమాలు, ఆరోగ్యం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.