జనరల్ వార్తలు ...

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన అయేషా మీరా కేసు క్లోజ్‌….

దేశవ్యాపితంగా సంచనలం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు ను సిబిఐ క్లోజ్ చేసింది .. 19 సంవత్సరాల క్రితం విజయవాడ ఇబ్రహీంపట్నం లో జరిగిన అయేషా మీరా హత్య కేసు ఎటు తేలకుండా ఈ విధంగా మూసివేయడంపై విస్మయం వ్యక్తం అవుతుంది …అనేక కేసులు శోధించి ఛేదించిన సిబిఐ ఈ కేసు దర్యాప్తు ను 19 ఏళ్లపాటు సాగదీసి ఆధారాలు లేవని క్లోజ్ చేయడం అత్యంతదారుణం ..ఇది అత్యంత ప్రతిష్ట కలిగిన దర్యాప్తు సంస్థగా పేరున్న సిబిఐ కి అప్రతిష్టను తెచ్చింది …

2019లో హైకోర్టు ఆదేశాల‌తో రంగంలోకి దిగిన సీబీఐ,ఆరేళ్ల పాటు ద‌ర్యాప్తు చేసింది .త‌మ‌కు ఎలాంటి కొత్త ఆధారాలు లభించ‌లేద‌న్న సీబీఐ ఈ కేసులో తాము ఏమి చేయలేమని చేతులెత్తేసింది ..

వివారాల్లోకి వెళ్ళితే 2007 డిసెంబర్‌ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్‌ హాస్టల్‌లో అయేషా మీరా దారుణ హ‌త్య‌కు గురైన సంగతి విదితమే ..ఈ కేసును దర్యప్తు చేసిన పోలీస్ అధికారులు సత్యంబాబు అనే ఒక అమాయకుణ్ణి పట్టుకొని జైల్లో పెట్టి సంవత్సరాల కొద్దీ నిర్బంధించారు .. స‌త్యంబాబు ను అనంతరం విడుదలైయ్యారు .. రీ పోస్టుమార్టం కోసం సేక‌రించిన త‌మ కూతురి అవ‌శేషాలు ఇవ్వాల‌న్న‌ అయేషా మీరా త‌ల్లి…ఈనెల 27న అయేషా మీరా అంత్య‌క్రియ‌లు మ‌త ఆచారం ప్ర‌కారం నిర్వ‌హించాల‌న్న సీబీఐ కోర్టు….

Related posts

పేటీఎం సీఈవో పదవి నుంచి తప్పుకున్న సురీందర్ చావ్లా

Ram Narayana

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మళ్ళీ పొడిగింపు : మరో ఏడాది ఛాన్స్!

Ram Narayana

వరుస ఘటనలతో భయాందోళన .. అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

Ram Narayana