జాతీయ వార్తలు

లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జి

  • లొంగిపోయిన మావోయిస్టు నాయకులు దేవ్ జీ, మల్లారెడ్డి
  • తెలంగాణ ఎస్ఐబీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
  • వీరితో పాటు 16 మంది లొంగుబాటు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి భద్రతా బలగాలకు సరెండర్ అయ్యారు. దేవ్ జీ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండగా, రాజిరెడ్డి పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నారు. రెండు రోజుల్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీ అలియాస్ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందినవాడు. వీరంతా తెలంగాణ ఎస్ఐబీ ఎదుట సరెండర్ అయ్యారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత సెక్రటరీగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.

Related posts

2023 లో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ ఫోన్లు

Ram Narayana

మళ్లీ రగిలిన మణిపూర్.. ఇళ్లకు నిప్పు

Ram Narayana

భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ కుమారుడు…

Ram Narayana