Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై ఎంపీ మనీశ్ తివారి తీవ్ర ఆవేదన!

పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై ఎంపీ మనీశ్ తివారి తీవ్ర ఆవేదన
-పార్టీలో ఇలాంటి అస్పష్ట, అరాచక వైఖరిని గతంలో ఎప్పుడూ చూడలేదు
-ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు
-చిన్నపిల్లల్లా గొడవ పడుతూ దారుణంగా తిట్టుకుంటున్నారు

పంజాబ్ కాంగ్రెస్ పార్టీ లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీ పరిణామాలపై సీనియర్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా నోరు ఇప్పడం తలనొప్పిగా మారింది. సీఎం అమరిందర్ సింగ్ ని మార్చి చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం గా ఎంపిక చేశారు. అయినప్పటికీ అమరిందర్ పార్టీ కి గుడ్ బై చెప్పటం బీజేపీ తో స్నేహంగా ఉండటం , తరువాత సొంతగా పార్టీ పెడతానని ప్రకటించడం వరసగా జరిగిపోయాయి. అమరిందర్ కు వ్యతిరేకంగా సిద్దు పావులు కదపడం సిద్దు ను నమ్ముకొని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం ,ఆతరువాత సిద్దు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆ తరువాత సిద్దు తన రాజీనామాను వెనక్కు తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ కు జరగాల్సిన డామేజ్ జరిగింది. కపిల్ సిబాల్ , కూడా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పడు మనీష్ తివారి తన స్వరాన్ని వినిపించడం విశేషం …

పంజాబ్ కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇలాంటి అస్పష్ట, అరాచక వైఖరిని గతంలో ఎప్పుడూ చూడలేదంటూ వరుస ట్వీట్లు చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టేసి ఎమ్మెల్యేలు, ప్రముఖులు చిన్నపిల్లల్లా గొడవ పడుతూ, అసహ్యంగా తిట్టుకుంటున్నారని అన్నారు. ఏదో సీరియల్‌లా సాగుతున్న ఈ అంశాలను ప్రజలు అసహ్యించుకోవడం లేదని పార్టీ భావిస్తున్నట్టు ఉందన్నారు.

అంతేకాదు, రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ ముప్పు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రం వంటి ఘటనలపై విచారణ ఎంత వరకు వచ్చిందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వాన్ని తివారి ప్రశ్నించారు. పంజాబ్‌లో పరిస్థితులను చక్కదిద్ది పార్టీ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటైన మల్లికార్జున ఖర్గే కమిటీ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టమైదని విమర్శించారు.

Related posts

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం!

Drukpadam

అమిత్ షాను కలిసే అవకాశాన్ని కల్పించండి: కిషన్ రెడ్డికి గద్దర్ విన్నపం!

Drukpadam

రేపు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న సోనియా గాంధీ!

Drukpadam

Leave a Comment