Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైద్రాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్… పనులు త్వరలో ప్రారంభం!

హైద్రాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్… పనులు త్వరలో ప్రారంభం!
ఆర్ఆర్ఆర్ నార్త్‌కి ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం
120 గ్రామాల నుంచి నాలుగు వేల ఎకరాల భూ సేకరణ
మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న పనులు

విశ్వ నగరంగా ప్రసిద్ధి గాంచిన హైద్రాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్ మణిహారం కానున్నది . ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్ ఉన్నప్పటికీ పెరుగుతున్న నగరం ,జనాభా ,పరిశ్రమలు రీత్యా రద్దీ తట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం రీజనల్ రింగ్ రోడ్ కు పచ్చ జెండా ఊపింది. ఇప్పటికే మ్యాప్ సిద్ధమైంది. 120 గ్రామాల నుంచి 4 వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేయనున్నారు.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్     పనుల ప్రారంభ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల సుమారు 40 కిలోమీటర్ల దూరంలో సమీప జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన  నిర్మాణానికి ఇప్పటికే కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. తాజాగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మహా నగరానికి ఉత్తరంగా 158 కిలోమీటర్ల మేర నిర్మించనున్న  అలైన్‌మెంట్‌కి ఆమోదం తెలిపినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం మరో నెల రోజుల్లో ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. 

గతంలో మూడేళ్ల కిందట రూపొందించిన అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులతో ప్రస్తుత కన్సల్టెన్సీ సంస్థ పంపిన నాలుగు ఆప్షన్లలో మొదటి ఆప్షన్‌కే ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది. కేవలం 1.2 కిలోమీటర్ దూరం తగ్గిస్తూ రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. మొత్తం 158.6 కిలోమీటర్ల మేర ఉత్తరం వైపు ఆర్ఆర్ఆర్ నిర్మించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా చూస్తే ఉత్తరం వైపు నాలుగు జిల్లాల పరిధిలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది.

నగరానికి సమీపంలోని నాలుగు జిల్లాల పరిధిలో ఉత్తరం వైపున ఆర్ఆర్ఆర్ నిర్మాణం కానుంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. సంగారెడ్డి, గజ్వేల్, ప్రగ్నాపూర్, జగ్‌దేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకూ నిర్మాణం సాగనుంది. సుమారు 120 గ్రామాల నుంచి 4 వేల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. సుమారు రూ.7,512 కోట్లు నిర్మాణ వ్యయంగా అంచనా వేస్తున్నారు.

అందులో 1800 కోట్ల రూపాయలు భూసేకరణకి ఖర్చు కానుంది. భూసేకరణ ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అలాగే ఆర్‌ఆర్ఆర్ ఇతర జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను అనుసంధానించే చోట భారీ ఇంటర్ ఛేంజర్లు నిర్మించనున్నారు. మరో నెల రోజుల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నగరానికి దక్షిణంగా నిర్మితం కానున్న ఆర్ఆర్‌ఆర్‌ చౌటుప్పల్, యాచారం, కందుకూర్, ఇబ్రహీంపట్నం, ఆమన్‌గల్, షాద్‌నగర్, కంది, మీదుగా సంగారెడ్డి వరకూ నిర్మించనున్నారు.

Related posts

యూపీలో మత కార్యక్రమాలకు యోగి సర్కారు కొత్త నిబంధన!

Drukpadam

సిబిఐ కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్…

Drukpadam

చంద్రబాబుకు మద్దతుగా రేపు హైదరాబాద్‌లో వినూత్న నిరసన.. ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’

Ram Narayana

Leave a Comment