Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం..

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం.. మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగి 36 మంది సజీవదహనం!
-ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న నౌక
-ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 మంది
-నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న పలువురు ప్రయాణికులు

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగిన ఘటనలో 36 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని ఝకాకఠి ప్రాంతంలోని నదిలో ఈ తెల్లవారుజామున జరిగింది. పడవలో ఉన్నవారందరూ హాహాకారాలు చేశారు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నీళ్లలో దూకారు . దీంతో చాలామంది తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు .

ఢాకా నుంచి బరుంగా వెళ్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 మంది ఉన్నారు.

ప్రాణాలు కాపాడుకోవడానికి వీరిలో చాలా మంది నదిలోకి దూకేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దాదాపు 100 మందిని బారిసాల్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. నదిలోకి దూకినవారిలో కొందరు నీటిలో మునిగిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతోంది.

Related posts

పవన్ కల్యాణ్ తో భేటీ అయిన మంచు మనోజ్

Drukpadam

శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు ఇస్తున్నాం: అల్లు అరవింద్

Ram Narayana

కృష్ణ-ఎన్టీఆర్ మధ్య విభేదాలు.. మళ్లీ ఒక్కటి చేసిన ‘తెలుగు వీర లేవరా’!

Drukpadam

Leave a Comment