Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నల్గొండ కలెక్టరేట్ లో సీఎం కెసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం!

నల్గొండ కలెక్టరేట్ లో సీఎం కెసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.
నల్గొండ జిల్లా కేంద్రం లో మౌలిక వసతులు అభివృద్ది పై జరుగుతున్న సమీక్ష..
పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్న సీఎం కెసీఆర్.

సీఎం కేసీఆర్ బుధవారం నల్గొండ లో పర్యటించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిషోర్ కుటుంబసభ్యులను పరామర్శించారు . అక్కడ నుంచి నల్గొండ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ జిల్లా అభివృద్ధిపై సమీక్షా నిర్వహించారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన అనంతరం జరుగుతున్న సమీక్ష సమావేశం లో మంత్రులు జగదీష్ రెడ్డి,హరీష్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్,
ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసి కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, భగత్, రవీంద్ర నాయక్,
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రమా రాజేశ్వరి, పలు శాఖల జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

 

Related posts

పారిశ్రామిక ఎగ్జిబిషన్ నుమాయిష్ ఒక్క రోజు తిరక్కుండానే క్లోజ్ !

Drukpadam

కరోనాతో అల్లాడుతున్న భారత్​ కు చైనా ఆపన్నహస్తం

Drukpadam

ఏపీలో టీడీపీ గెలుస్తోందంటూ ‘టైమ్స్ నౌ’ చెప్పడం నిజం కాదా?

Ram Narayana

Leave a Comment