Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకే అన్ని పార్టీల మొగ్గు :కేంద్ర ఎన్నికల సంఘం!

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకే అన్ని పార్టీల మొగ్గు :కేంద్ర ఎన్నికల సంఘం
కరోనా పేషెంట్లు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు..
అధికారులే వారింటికి వెళ్లి ఓటేయిస్తారు
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సీఈసీ సుశీల్ చంద్ర ప్రెస్ మీట్
ఎన్నికల నిర్వహణకే అన్ని పార్టీలు మొగ్గు చూపాయి
లక్ష పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం
యూపీలో 18–19 ఏళ్ల యువ ఓటర్లే ఎక్కువ
గత ఎన్నికలతో పోలిస్తే మూడు రెట్ల పెరుగుదల

హైకోర్టు హెచ్చరికలు , ముంచుకొస్తున్న కరోనా థర్డ్ వేవ్ ,పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు కూడా పట్టించుకోకుండా అన్ని రాజకీయపార్టీలు ఎన్నికలకు మొగ్గు చూపడం విశేషం . ఈ విషయాన్నీ స్వయంగా ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుశీల్ చంద్ర తెలిపారు. అందువల్ల ఎన్నికల నిర్వాణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్త అవుతుంది. జనవరి మొదటివారం చివరలో లేదా రెండవవారం మొదట్లో ఎన్నికల షడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

అన్ని పార్టీలూ ఎన్నికలకే మొగ్గు చూపాయని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలంటూ అన్ని రాజకీయ పార్టీలూ కోరాయన్నారు.

ఓటర్ల తుది జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల పోలింగ్ కు సంబంధించి లక్ష పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ బూత్ లలోనూ వీవీ ప్యాట్ లను ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సుశీల్ చంద్ర ఆదేశించారు. కరోనా పేషెంట్లు ఇంటి నుంచే ఓటు వేయొచ్చని పేర్కొన్నారు. అధికారులే కరోనా పేషెంట్ల ఇంటికి వెళ్తారని వారి ఓటును నమోదు చేయిస్తారని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒక్కో బూత్ లో కేవలం 1,200 ఓటర్లకే అనుమతిస్తామన్నారు. అందుకు అనుగుణంగా యూపీలో 11 వేల కేంద్రాలను పెంచామన్నారు.

ఈ సారి 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లే ఎక్కువగా ఉన్నారని సీఈసీ సుశీల్ చంద్ర చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు పెరిగారని తెలిపారు. మహిళా ఓటర్ల నిష్పత్తి కూడా 839 నుంచి 868కి పెరిగిందన్నారు.

Related posts

ఏపీ నుంచి బిశ్వభూషణ్ వెళ్లడం బాధాకరం: సీఎం జగన్

Drukpadam

పంచదార స్థానంలో బెల్లం వాడుకోవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?

Drukpadam

కర్ణాటక ఫలితాల్లో 1957 నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ!

Drukpadam

Leave a Comment