ఆంధ్రప్రదేశ్

లైబీరియా చర్చిలో విషాదం.. తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం!

లైబీరియా చర్చిలో విషాదం.. తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం!

  • రాత్రి వేడుక సమయంలో దుర్ఘటన 
  • మారణాయుధాలతో ప్రవేశించిన దోపిడీ ముఠా
  • భయంతో పరుగులు తీసిన ప్రజలు

లైబీరియా రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 29 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షి కథనం. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు.

ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. లైబీరియాలో దోపిడీ ముఠాలు వేడుకలను లక్ష్యంగా చేసుకోవడం అక్కడ సాధారణమే.

Related posts

క‌రోనా ఎఫెక్ట్… ఉద‌యం రాజ్యసభ, సాయంత్రం లోక్ సభ సమావేశాలు!

Drukpadam

ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య!

Drukpadam

పరిపాలన సంస్కరణల దిశగా కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్!

Drukpadam