Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లైబీరియా చర్చిలో విషాదం.. తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం!

లైబీరియా చర్చిలో విషాదం.. తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం!

  • రాత్రి వేడుక సమయంలో దుర్ఘటన 
  • మారణాయుధాలతో ప్రవేశించిన దోపిడీ ముఠా
  • భయంతో పరుగులు తీసిన ప్రజలు

లైబీరియా రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 29 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షి కథనం. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు.

ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. లైబీరియాలో దోపిడీ ముఠాలు వేడుకలను లక్ష్యంగా చేసుకోవడం అక్కడ సాధారణమే.

Related posts

ఏపీ రాజధానిపై అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు సీజే!

Drukpadam

పాక్‌లో హైడ్రామా!.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ మ‌రోమారు వాయిదా!

Drukpadam

లబ్దిదారులను మోసం చేస్తున్న టీఆర్ యస్ ప్రభుత్వం :రేవంత్ రెడ్డి !

Drukpadam

Leave a Comment