క్రైమ్ వార్తలు

సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్!

సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేశాం: ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక!

  • రాజుపాలెపు ఫణి అనే వ్యక్తి అరెస్ట్
  • సీఎంపై బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడి
  • మానవబాంబుగా మారతానన్నాడని వివరణ
  • చట్టవ్యతిరేక పోస్టులు చేస్తే చర్యలు తప్పవని స్పష్టీకరణ

ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎంను చంపుతానంటూ రాజుపాలెపు ఫణి అనే జనసేన మద్దతుదారుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని వెల్లడించారు. సీఎంపై బెదిరింపులకు పాల్పడిన ఆ జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేశామని తెలిపారు. మానవబాంబుగా మారి సీఎంను హతమార్చుతానని ట్విట్టర్ లో పోస్టు చేశాడని, తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశాడని ఎస్పీ రాధిక వివరించారు.

అతడు తన అసలు పేరుకు బదులు కన్నా భాయ్ అనే అకౌంట్ ద్వారా పోస్టులు చేశాడని ఆమె వివరించారు. అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసి హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఫణిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. చట్టవిరుద్ధంగా పోస్టులు పెట్టేవారిపై చర్యలు ఉంటాయని ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. విచారణలో పవన్ అభిమానినని, జనసేన మద్దతుదారుడినని ఫణి చెప్పాడని వివరించారు.

Related posts

మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు: వివేకా హత్యకేసు నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్య!

Drukpadam

మరో 232 యాప్‌లను నిషేధించనున్న కేంద్రం.. చైనా లింకులే కారణం..

Drukpadam

యూకేలో భార్యను గొంతు నులిమి చంపేసి, కారు డిక్కీలో పడేసి పరార్.. వీడిన ఢిల్లీ అమ్మాయి హత్య కేసు

Ram Narayana