Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మీడియా పై మాయావతి చిందులు ….కులపిచ్చి ఉందంటూ ఆగ్రహం !

మీడియా మొత్తం కులపిచ్చితో ఉంది.. టీవీ డిబేట్లను బహిష్కరిస్తున్నాం: మాయావతి!
-అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అవకాశాలను మీడియా దెబ్బతీసిందని ఫైర్
-బీజేపీకి బీఎస్పీ బీ-టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేసింది
-ముస్లింలు, బీజేపీ వ్యతిరేకులు మాకు దూరమయ్యారన్న మాయావతి

ఉత్తరప్రదేశ్ లో దళిత బవుజనుల పార్టీగా పేరున్న బీఎస్పీ అత్యంత ఘూరోంగా ఓటమి చెందింది . రాష్ట్ర శాసనసభలో 403 సీట్లు ఉండగా కేవలం ఒక్క సీటులో మాత్రమే గెలిచింది. ఇంతటి ఘోరపరాభవం నుంచి బయటపడేందుకు ఆ పార్టీకి సమయం పడుతుంది. బీజేపీ మరోసారి భారీ మెజార్టీ సాధించి రెండో సారి అధికారాన్ని చేపట్టబోతోంది. ఈ ఫలితాలతో బీఎస్పీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి.

కానీ తనను మీడియా దెబ్బతీసిందని ,మీడియా మొత్తం కుల పిచ్చితో ఉందని మాయావతి ఆరోపిస్తున్నారు . అది ఆమె అభిప్రాయం . మీడియా లో పై చిందులు తొక్కటం ఆమె ఇష్టం కానీ అసలు టీవీ డిబేట్లకే వెళ్లవద్దని నిర్ణయం తీసుకోవడం పై ఆమె పునరాలోచించుకోవాలి . పార్టీ ఓటమికి ఒక్క మీడియా నే కారణం అనేది సత్యదూరమైన మాట అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మాయావతి లాంటి సీనియర్ పొలిటిసియన్ దీనిపై పునరాలోచన చేస్తే బావుంటాడనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియో మొత్తం కులపిచ్చితో ఉందని ఆమె ఆరోపించారు. యూపీలో తమ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది మీడియానే అని మండిపడ్డారు. అంబేద్కర్ భావజాలంతో పని చేస్తున్న బీఎస్పీని కుల పిచ్చితో ఉన్న మీడియా దెబ్బతీసిందని అన్నారు. మీడియా సంస్థల యజమానులకు ఉన్న కుల వివక్ష, విద్వేషాలను ఎవరికీ తెలియకుండా దాయలేరని దుయ్యబట్టారు.

బీజేపీకి బీఎస్పీ బీ-టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేసింది మీడియానే అని… ఈ దుష్ప్రచారం వల్ల ముస్లింలు, బీజేపీ వ్యతిరేక ఓటర్లు బీఎస్పీకి దూరమయ్యారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి టీవీ డిబేట్లను తమ పార్టీ బహిష్కరిస్తోందని సంచలన ప్రకటన చేశారు.

Related posts

పవన్ కళ్యాణ్ ఇజ్జత్ కా సవాల్ తిరుపతి ఉపఎన్నిక

Drukpadam

ఆంధ్రకు సాధ్యం కాని ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలా సాధ్యం…?

Drukpadam

సి జె ఐ పర్యటనపై తెలుగు దేశం స్పందన…

Drukpadam

Leave a Comment