Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అడ్రస్ లేని లవంగం గాళ్లంతా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ !

అడ్రస్ లేని లవంగం గాళ్లంతా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ !
-మునుగోడు ఎన్నికల నేపథ్యంలో వేడెక్కిన రాజకీయాలు
-తూటాల్లాంటి మాటలతో మారుమోగుతున్న మునుగోడు పల్లెలు
-చంద్రబాబు, వైఎస్సారే నయమన్న కేటీఆర్
-మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా పేలుతున్న మాటల తూటాలు
-ఈడీ, బోడీలతో మనల్ని ఏమీ చేయలేరన్న కేటీఆర్
-తమ ఆరోపణలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్

మునోగుడు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బీఆర్ యస్ నేత కేటీఆర్ బీజేపీ పై ఫైర్ అయ్యారు . కేటీఆర్ లో ఇంతటి ఆగ్రహాన్ని ఎప్పడు చూడలేదని గులాబీ పార్టీ కార్యకర్తలే అంటున్నారు . అడ్రస్ లేని లవంగం గాళ్లంతా మాట్లాడుతున్నారని వారికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు .చిల్లర రాజకీయాలు కాంట్రాక్టుల కోసం పార్టీలు మారి డబ్బు సంచులతో ఎన్నికలకు రావడంపై ఆయన మండి పడ్డారు . గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నప్పుడు కేసీఆర్ బీఆర్ యస్ పెట్టి దేశ రాజకీయాలు చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న మత, కుల ,విచ్చిన్న , రాజకీయాలపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ని బీజేపీ అప్పగించిందని ఆరోపించారు. ఒక కాంట్రాక్టర్ అహం కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. ఉద్యమం సమయంలో ఈ బఫూన్ గాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అడ్రస్ లేని లవంగం గాళ్లంతా ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, వైఎస్సారే బెటర్ అని… ఇప్పుడు బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. పిచ్చోళ్లతో పోరాడాల్సి వస్తోందని చెప్పారు. తాము చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గుజరాత్ వాళ్లు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తున్నప్పుడు… టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కావద్దా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ దేశంలో రాజకీయాలు చేయొద్దా? అని అడిగారు. మన జెండా, గుర్తు మారదని… ఎవరూ తికమక పడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఈడీ, బోడీలతో మనల్ని ఏమీ చేయలేరని అన్నారు.

Related posts

రూ.41 వేల కోట్ల ఖర్చుకు లెక్కలు లేవన్న పయ్యావుల… ఏపీ ఆర్థికశాఖ వివరణ!

Drukpadam

135 సీట్లతో సంతోషంగా లేనన్న డీకే శివకుమార్.. పార్టీ శ్రేణులకు సరికొత్త టార్గెట్…

Drukpadam

తొలిసారి అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయి: ప్రధాని మోదీ

Drukpadam

Leave a Comment