రాజకీయ వార్తలు

భద్రాద్రి భక్తులకు ఆర్టీసీ సరికొత్త ఆఫర్.. రూ. 116 చెల్లిస్తే సీతారాముల కల్యాణ తలంబ్రాల డోర్ డెలివరీ!

భద్రాద్రి భక్తులకు ఆర్టీసీ సరికొత్త ఆఫర్.. రూ. 116 చెల్లిస్తే సీతారాముల కల్యాణ తలంబ్రాల డోర్ డెలివరీ!

  • కల్యాణ తలంబ్రాల బుకింగ్ సేవలను ప్రారంభించిన ఆర్టీసీ
  • తొలి బుకింగ్ చేసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • గతేడాది 89 వేల మందికి తలంబ్రాలు అందించామన్న ఆర్టీసీ ఎండీ

భద్రాద్రి రామయ్య భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరిన వారికి ఇంటికే డోర్ డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. అయితే, ఇందుకోసం రూ. 116 చెల్లించాల్సి ఉంటుంది. కావాల్సిన వారు ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఆ మొత్తం చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో నిన్న కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని తెలిపారు. అంతేకాదు, రూ. 116 చెల్లించి బుకింగ్‌ను ప్రారంభించారు. గతేడాది కూడా 89 వేల మందికి స్వామి వారి కల్యాణ తలంబ్రాలను అందించినట్టు తెలిపారు. ఈ సేవలు పొందాలనుకునేవారు ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగాన్ని 91776 83134, 73829 24900, 91546 80020 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Related posts

ప్రియాంక సరూర్ నగర్ నిరుద్యోగ సంఘర్షణ సభ సక్సెస్ …కాంగ్రెస్ లో జోష్ … భారీగా హాజరైన యువత …

Drukpadam

నా ప్రజాసామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరు… గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తా: జేపీ నడ్డా!

Drukpadam

కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్… ప్రధాని మోడీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్…

Drukpadam