Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్!

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్!

  • టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారం
  • తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్, రేవంత్ లకు కేటీఆర్ నోటీసులు
  • కేటీఆర్ నోటీసులను లీగల్ గానే ఎదుర్కొంటానన్న బండి సంజయ్
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడం తెలిసిందే. వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే రూ.100 కోట్ల పరువునష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో హెచ్చరించారు.

కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. మంత్రి కేటీఆర్ పరువుకే రూ.100 కోట్లయితే, 30 లక్షల మంది యువతకు ఎంత మూల్యం చెల్లిస్తారని ప్రశ్నించారు. పేపర్ లీక్ వెనుక నా కుట్ర ఉందన్న కేటీఆర్ పై ఎంత దావా వేయాలని బండి సంజయ్ నిలదీశారు.

కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసేదాకా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసులను లీగల్ గానే ఎదుర్కొంటామని వెల్లడించారు. ప్రశ్నాపత్రాల లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Related posts

పుచ్చలపల్లి సుందరయ్య శిష్యుడి నుంచి సీఎం జగన్ కు ప్రసంశలు !

Drukpadam

బీజేపీ పాలనలో ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తం :సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు విజయ్‌ రాఘవన్‌!

Drukpadam

తనతో భేటికి చైనా అధ్యక్షుడు నో చెప్పాడనే వార్తలపై బైడెన్ స్పందన!

Drukpadam

Leave a Comment