జాతీయ వార్తలురాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ, ఖర్గేలతో ఏం చర్చించలేదు: డీకే శివకుమార్

రాహుల్ గాంధీ, ఖర్గేలతో ఏం చర్చించలేదు: డీకే శివకుమార్

  • కేవలం ప్రణామ్ చేసి వచ్చానన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
  • సిద్ధూ, డీకేలతో ఢిల్లీ పెద్దల వరుస భేటీలు
  • డీకే సొంత జిల్లా రామనగరలో కట్టుదిట్టమైన భద్రత

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరిద్దరితో సమావేశమైన అనంతరం మీడియా ప్రతినిధులు డీకే శివకుమార్ ను పలకరించారు. వారితో ఏమీ చర్చించలేదని, కేవలం ప్రణామ్ (నమస్కారం) చేశానని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా తేల్చలేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య రేసులో ఉన్నారు. ఇరువురు నేతలు పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో అధిష్ఠానం వారితో వరుసగా చర్చలు జరుపుతోంది.

కర్ణాటకలోని రామనగర జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రామనగర డీకే శివకుమార్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్యను ప్రకటించనున్నారని, ఈ మేరకు దాదాపు నిర్ణయం జరిగిందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో శివకుమార్ మద్దతుదారులు రామనగరలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Related posts

బీఆర్ఎస్ కు జిల్లాలో తిరుగులేదు : వద్దిరాజు

Drukpadam

కాంగ్రెస్ పార్టీలోకి డీఎస్ పునరాగమనం… రేపు అధికారిక ప్రకటన!

Drukpadam

కేజ్రీవాల్ రోడ్ షో లో ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు!

Drukpadam