Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దమ్మున్న పార్టీ బీజేపీ …దమ్మున్న జెండా కాషాయం …ఖమ్మంలో బండి సంజయ్ ….

దమ్మున్న పార్టీ బీజేపీ …దమ్మున్న జెండా కాషాయం …ఖమ్మంలో బండి సంజయ్ ….
-ఖమ్మంలో ఎక్కడుంది బీజేపీ అన్నవాళ్లకు ఈ ర్యాలీ నిర్శనం
-బీజేపీ అంబేద్కర్ పాదాల చెంత ఉంది
-ఖమ్మం కాంగ్రెస్ , కమ్యూనిస్టులకు అడ్డా కాదు …బీజేపీ అడ్డా కాబోతుంది
-నిరుద్యోగులరా …నిరుత్సహ పడకండి…బీజేపీ అధికారంలోకి వస్తుంది

దమ్మున్న పార్టీ బీజేపీ …దమ్మున్న జెండా కాషాయం …దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ అందువల్లనే బీజేపీ కేంద్రంలోను అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు . శనివారం ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు . కేసీఆర్ నాయకత్వంలో ఉన్న బీఆర్ యస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజముట్టరు . వెంటిలేటర్పై ఉన్న బీఆర్ యస్ ను ఎవరు రక్షణించలేరని సంజయ్ పేర్కొన్నారు . ప్రజల సమస్యలు పరిస్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు …ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది అని ఎగతాళి చేసినవారికి చెబుతున్నా ఇప్పుడు బీజేపీ అంబేద్కర్ పాదాల చెంత ఉందని …ఖమ్మంలో బీజేపీ మంచి జోష్ మీద ఉంది. దానికి నిరుద్యోగ మార్చ్ నిదర్శనం …నిరుద్యోగులు నిరుత్సాహ పడవద్దు బీజేపీ అధికారంలోకి వస్తుంది. అందరికి ఉద్యోగులు ఇస్తుందని భరోసా కలిపించారు .బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్నారు . ఆయన వెంట బీజేపీ తమిళనాడు సహా ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి , జిల్లా నాయకులూ పాల్గొన్నారు . ఇల్లందు రోడ్ నుంచి అంబెడ్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు . అంబేద్కర్ సెంటర్ లో జరిగిన సభలో సంజయ్ తోపాటు సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు . నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు ఈర్ష్య ,ద్యేశం తో వెళ్లడంలేదని విమర్శించారు . తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సర్కార్ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు . కేసీఆర్ హటావో …తెలంగాణ కో బచావో అని సుధాకర్ రెడ్డి నినదించారు .

Related posts

ఖమ్మం టీఆర్ యస్ లో బీసీల అసంతృప్తి!

Drukpadam

సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు!

Drukpadam

టీ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం!

Drukpadam

Leave a Comment