Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సజ్జల సహా పలువురు సలహాదారుల పదవీ కాలం పొడిగింపు..!

సజ్జల సహా పలువురు సలహాదారుల పదవీ కాలం పొడిగింపు..!

  • పదవీకాలం పొడిగించేందుకు నిర్ణయం
  • కృష్ణమోహన్, కల్లాం, శామ్యూల్ కు కూడా వర్తింపు
  • ఇప్పటికే రెండుసార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. సజ్జల సహా నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. సజ్జలతో పాటు జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. వీరిని ముందుగా మూడేళ్ల పదవీకాలంలో నియమించింది. ఆ తర్వాత అందరకీ ఒకే పదవీకాలం ఉండాలంటూ రెండేళ్లకు కుదించింది. అయితే, ఇప్పటికే రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం మూడోసారి కూడా వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ ఆరోపణ!

Drukpadam

కాంగ్రెస్​ అధ్యక్ష పదవి ఎన్నికలకు తేదీ ఖరారు చేసిన సీడబ్ల్యూసీ…

Drukpadam

ఢిల్లీలో జగన్ బిజీ షడ్యుల్:కేంద్ర మంత్రులతో వరస భేటీలు …

Drukpadam

Leave a Comment