Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేణుకాచౌదరితో పొంగులేటి ఏకాంత చర్చలు …మెత్తబడ్డ ఫైర్ బ్రాండ్

రేణుకాచౌదరితో పొంగులేటి ఏకాంత చర్చలు …మెత్తబడ్డ ఫైర్ బ్రాండ్

కాంగ్రెస్ లోకి వెళుతున్నాం కాబట్టే రేణుకా చౌదరితో మాట్లాడాం: పొంగులేటి

  • బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి
  • తొలుత బీజేపీలోకి వెళతారని ప్రచారం
  • అయితే కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్న ఖమ్మం జిల్లా నేత
  • త్వరలో హస్తం పార్టీలో చేరేందుకు నిర్ణయం

పొంగులేటి చేరికపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయడమే కాకుండా ,అధిష్టానం పెద్దలవరకు వెళ్లి ఫిర్యాదు చేసిన మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరితో పొంగులేటి ఏకాంత చర్చలు జరిపారు .అరగంటకు పైగా వీరి చర్చల అనంతరం రేణుక కొంత మెత్త పడ్డట్లు కనిపించారు.

బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఆయన తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరితో అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటిని మీడియా పలకరించింది.

తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నాను కాబట్టే మేడమ్ తో సమావేశమయ్యానని, ఈ సమావేశానికి అంతకంటే ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. రేణుకా చౌదరితో ఇతర అంశాలేవీ చర్చించలేదని, పార్టీలోకి తాము వస్తున్న విషయం గురించే మాట్లాడినట్టు వెల్లడించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలుస్తానని పొంగులేటి వివరించారు.

మరో బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, పొంగులేటి, జూపల్లి తొలుత బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. వారితో పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమైనా, ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. అయితే, పొంగులేటి, జూపల్లిని ఆకర్షించడంలో కాంగ్రెస్ నేతలు సఫలమైనట్టు ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

Related posts

రూ. 1,415 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్ లో ప్రకటించిన డీకే శివకుమార్

Drukpadam

ప్రశ్నిస్తే కూల్చివేతలు ,భయోత్పాతం … అచ్చంనాయుడు మండిపాటు…

Drukpadam

శాసనసభలో చాడ వెంకటరెడ్డి ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ …..

Drukpadam

Leave a Comment