Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

గీత దాటితే వేటు తప్పదు…తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్ ..!

ఆ ఇద్దరిపై వేటు వేస్తే…: తెలంగాణ నేతలకు క్లాస్ పీకిన రాహుల్ గాంధీ!

  • పార్టీ అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కవద్దని హెచ్చరిక
  • తెలంగాణలో ఇద్దరు దొరికేలా ఉన్నారని వ్యాఖ్య
  • అధికారం కావాలా? మీడియాలో కనబడటం కావాలా? అని ప్రశ్న

ఇక నుండి ఎవరైనా మీడియాకు ఎక్కితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కర్ణాటకలోను ఇలాంటి పరిస్థితి ఎదురైందని, తెలంగాణలో ఇద్దరు దొరికేలా ఉన్నారని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. వారు దొరికితే మాత్రం ఆ ఇద్దరిపై వేటు వేస్తే అంతా సెట్ అవుతుందని చెప్పారట. అధికారం కావాలా.. మీడియాలో కనబడటం కావాలా? అని అందరికీ కలిపి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. కాగా, తెలంగాణలో ఇద్దరు దొరికేలా ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరనే చర్చ సాగుతోంది.

స్ట్రాటెజీ కమిటీ భేటీ సందర్భంగా రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి సహా పలువురు నేతలు వివిధ అంశాలపై మాట్లాడగా.. సాధ్యమయ్యే హామీల గురించి మాట్లాడుదామని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఫిర్యాదు చేయబోయిన నేతలను కూడా రాహుల్ వారించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అందరి గురించి తెలుసునని చెప్పారని తెలుస్తోంది. కానీ ఈసారి గీత దాటితే మాత్రం అలాంటివారిపై చర్యలు ఖాయమని చెప్పారట.

ఎవరూ డిక్లేర్ చేయవద్దు…

ఈ కమిటీలో పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు అగ్రనేతలు. కర్ణాటక తరహా త్వరగా టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. క్లియర్ గా ఉన్న స్థానాలకు రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఏ నేత కూడా టిక్కెట్ డిక్లేర్ చేయవద్దని సూచించారు. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ టిక్కెట్లు ఖరారు చేస్తుందని చెప్పారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి సలహాలు, సూచనలు మాత్రం ఇవ్వాలని చెప్పారు. మండల, బూత్ స్థాయి కమిటీలు వేయాలని సూచించారు. ధరణిని ఉపయోగించుకోవాలన్నారు. ఓబీసీలకు టిక్కెట్ల విషయంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై క్లారిటీ ఇస్తామని చెప్పారని తెలుస్తోంది.

కేసీఆర్‌తో దోస్తీపై తేల్చేసిన రాహుల్ గాంధీ.. జాతీయ కూటమిలోను నో ఛాన్స్

Rahul Gandhi clarifies on alliance with BRS

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. స్ట్రాటెజీ కమిటీ సమావేశం అనంతరం వీహెచ్, మధుయాష్కీ గౌడ్, మల్లు భట్టి విక్రమార్క తదితరులు మాట్లాడారు.

బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. వచ్చే ఐదు రోజుల్లో పదవులు అన్నీ భర్తీ చేస్తామని చెప్పారని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, నాయకులు అందరూ ఏకతాటిపై నడవాలని సూచించారని చెప్పారు. కేసీఆర్ తీసుకువచ్చిన ధరణిపై కమిటీ వేయాలని రాహుల్ నిర్ణించారు. 

కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా నేతలకు స్పష్టం చేశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను పొత్తుకు అవకాశం లేదని, జాతీయ కూటమిలోను బీఆర్ఎస్ కు చోటులేదని ఖర్గే ఈ సమావేశంలో చెప్పారని అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పారు.

బీజేపీ దుష్ప్రచారం

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. పొత్తు ఉండదని ఖర్గే చెప్పారని వీహెచ్ అన్నారు.

కర్ణాటకలో వచ్చిన ఫలితాలే

కర్ణాటకలో వచ్చిన ఫలితాలే తెలంగాణలో వస్తాయని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని, ఇల్లులేని వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12,500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున బీమా అందిస్తామన్నారు. ధరణి పోర్టల్ పై పోరాటం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు, క్వార్టర్ ఖాళీ చేయించడం అంతా దురుద్దేశ్యంతో జరిగిందన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందన్నారు.

Related posts

మల్లాది వాసు సారీ !…..వల్లభనేని వంశీ పశ్చాతాపం!!…

Drukpadam

నల్లగొండలో అమాన‌వీయ ఘ‌ట‌న‌..వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే ప్రసవించిన మహిళ!పైగా హాస్పటల్ కు వచ్చిన గర్భిణీ మహిళను దుర్బాషలాడిన సిబ్బంది

Ram Narayana

డీఎస్ లేని లోటు ఎవరూ తీర్చలేరు: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment