Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

అమితాబ్ బచ్చన్‌కు 82 ఏళ్లు.. ఇప్పటికీ నటిస్తున్నారుగా!: అజిత్‌కు సుప్రియా సూలే కౌంటర్…

అమితాబ్ బచ్చన్‌కు 82 ఏళ్లు.. ఇప్పటికీ నటిస్తున్నారుగా!: అజిత్‌కు సుప్రియా సూలే కౌంటర్…

  • ఎన్సీపీని అవినీతి పార్టీ అన్న బీజేపీతో ఎలా జతకట్టారు? అని సుప్రియ ప్రశ్న
  • సైరస్ పూనావాలా 84 ఏళ్ల వయస్సులోను పని చేస్తున్నారని వెల్లడి
  • పార్టీ గుర్తును ఎవరూ ఎత్తుకెళ్లలేరన్న శరద్ పవార్

బీజేపీలో నేతలు 75 ఏళ్లకే పదవీ విరమణ తీసుకుంటారని, మీకు 83 ఏళ్లున్నాయి.. మీరు రిటైర్ అవుతున్నారా? లేదా? చెప్పాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను అజిత్ పవార్ ప్రశ్నించారు. అజిత్ వ్యాఖ్యలపై ఎంపీ సుప్రియా సూలే ఘాటుగా స్పందించారు. సైరస్ పూనావాలా వయస్సు 84 అని, ఇప్పటికీ ఆయన పని చేస్తున్నారని, అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వయస్సులోను నటిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.

ఇక శరద్ పవార్ తనకు మాత్రమే తండ్రి కాదని, ఎన్సీపీ కార్యకర్తలందరికీ తండ్రిలాంటివాడు అనీ అన్నారు. నీకు కావాల్సిన వారి మీద మాటల దాడి చేసుకో.. కానీ నా తండ్రిపై కాదని మండిపడ్డారు. ఎన్సీపీని అవినీతి పార్టీ అంటూ బీజేపీ విమర్శలు చేసిందని, ఇప్పుడు తమ పార్టీలోని ఓ వర్గంతో ఎలా జత కట్టిందని ప్రశ్నించారు.

తన మద్దతుదారులతో భేటీ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ… ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఓపెన్ కమ్యూనికేషన్ లేదని, సామాన్యుడి మనోభావాలను అర్థం చేసుకోవాలంటే మైదానంలోకి వెళ్లాలని మండిపడ్డారు. ప్రధాని అంటే దేశానికి ప్రాతినిథ్యం వహించాలని కానీ, ఒక పార్టీకి కాదని విమర్శించారు. ఎన్సీపీ నేతలపై కేసులు ఉంటే ప్రభుత్వంలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.

పీవీ నర్సింహారావు, మన్మోహన్ హయాంలో ఎంపీలు తమ నియోజకవర్గ సమస్యలపై సమావేశాల్లో మాట్లాడేవారని, ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నారు. సంప్రదింపులు లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని, ఇది అప్రజాస్వామికమన్నారు. పార్టీ గుర్తును ఎవరూ లాక్కోలేరని, నాయకులు, కార్యకర్తలు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీరు నన్ను గురువు అంటున్నారు, నేనే మీకు స్పూర్తి అంటున్నారు.. అలాంటప్పుడు తనను ఎలా నిర్లక్ష్యం చేశారని నిలదీశారు.

మీకు 83 ఏళ్లు.. రిటైర్ అవుతారా?.. లేదా?: శరద్ పవార్‌కు అజిత్ పవార్ సూటి ప్రశ్న

  • అజిత్ పవార్ భేటీలో 35 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు
  • శరద్ పవార్ వర్గం భేటీలో 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు
  • శరద్ పవార్ తమకు స్ఫూర్తి అన్న అజిత్ పవార్
Sharad Pawar is our inspiration says Ajit Pawar

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం తర్వాత ఆ పార్టీలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. తమదే అసలైన పార్టీ అని, తమ వెంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు పోటాపోటీగా బలప్రదర్శన చేశాయి. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రాలో ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ సమావేశం కాగా, 35 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉండగా, ఐదుగురు భేటీకి హాజరయ్యారు.

మరోపక్క, ముంబై నారీమన్ పాయింట్ లో సమావేశమైన శరద్ పవార్ వర్గం భేటీకి 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్ వర్గం ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. కొంతమంది అజిత్ పవార్ పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీ – ఏక్ నాథ్ షిండే శివసేన కూటమిలో తాము ఎన్సీపీ పార్టీగానే చేరామన్నారు. తమది తిరుగుబాటు కాదన్నారు. తాను ఎప్పుడూ శరద్ పవార్ వెంటే ఉన్నానని, ఇప్పుడు కూడా ఆయన ఆశీస్సులు కోరుకుంటున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం తాము శివసేన-బీజేపీ కూటమిలో చేరామన్నారు.

ఆ తర్వాత అజిత్ పవార్ మాట్లాడుతూ… శరద్ పవార్ తమకు స్పూర్తి అన్నారు. సోనియాగాంధీని ఎదిరించిన నేత శరద్ పవార్ అని ప్రశంసించారు. శరద్ పవార్ నాయకత్వంలో పని చేశానని, ఆయన నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.  ప్రభుత్వంలో ఏ పదవినైనా నిర్వహించే సామర్థ్యం తమకు (ఎన్సీపీకి) ఉందన్నారు. ఎన్సీపీ అంటేనే అభివృద్ధి అన్నారు. 2004లో కాంగ్రెస్ కంటే ఎన్సీపీకి ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠం మాత్రం తమ పార్టీ కోల్పోయిందన్నారు. ప్రధాని మోదీకి ప్రజల నుండి అపూర్వమైన మద్దతు ఉందని, ఆయనకు భారత్ ఓటు వేస్తోందని ప్రశంసించారు. తాను ఎప్పుడూ కుటుంబ రాజకీయాలు చేయలేదన్నారు. మహారాష్ట్ర దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగానే ఉండాలన్నారు. ఎన్సీపీ నాయకత్వంలో ఛగన్ భుజ్ లాల్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు.

2019లో శివసేనతో ప్రభుత్వాన్ని శరద్ పవార్ కోరుకోలేదని, అందుకే తమ పార్టీ అధినేత బీజేపీ అధిష్ఠానాన్ని కలిశారని చెప్పారు. 2017లోను వర్ష బంగ్లాలో బీజేపీ పెద్దలను కలిశారని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు కొంతమంది ఈ సమావేశానికి రాలేదని తెలిపారు. బీజేపీలో 75 ఏళ్లకు నేతలు రిటైర్ అవుతుంటారు. దీనిని ఉటంకిస్తూ, శరద్ ను ఉద్దేశించి అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘మీకు 83 ఏళ్లున్నాయి, మీరు రిటైర్ అవుతున్నారా? లేదా?’ చెప్పాలని ప్రశ్నించారు.

Related posts

పెట్రో ధరలు సమస్యగానే ఉంది దీన్ని అంగీకరిస్తున్నాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Drukpadam

యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ!

Drukpadam

కేటీఆర్… ఇంత విధ్వంసం జరుగుతుంటే సమీక్ష చేసే టైమ్ లేదా?: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment