Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

పార్లమెంట్ లో అడుగుపెట్టిన రాహుల్.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి ముందు కీలక పరిణామం

  • 4 నెలల తర్వాత పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీ
  • మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన కాంగ్రెస్ అగ్రనేత
  • రేపు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు 4 నెలల తర్వాత మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వంపై విధించిన నిషేధాన్ని ఈ ఉదయం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో ఆయన పార్లమెంటుకు వచ్చారు. మార్చ్ 24న రాహుల్ గాంధీ సభ్యత్వంపై నిషేధం విధించారు. 

మరోవైపు, పార్లమెంటుకు వచ్చిన రాహుల్ తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం పార్లమెంటు భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ కు ఇండియా కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రేపు లోక్ సభలో ఈ తీర్మానంపై చర్చ ప్రారంభంకానుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఒక రోజు ముందు రాహుల్ పార్లమెంట్ లో అడుగుపెట్టడం కీలక పరిణామంగా భావించవచ్చు.

రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై నిషేధం ఎత్తివేత.. మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టనున్న కాంగ్రెస్ అగ్రనేత

  • రాహుల్ కు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు
  • సుప్రీం తీర్పుతో రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన లోక్ సభ సెక్రటేరియట్
  • వయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఆయనపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఆయన ఎంపీగా మళ్లీ పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. 

మోదీ ఇంటిపేరు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సూరత్ కోర్టు జడ్జి రాహల్ కు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయన ఎంపీగా అర్హతను కోల్పోయారు. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. సూరత్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో అప్పీలు చేసినప్పటికీ అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

రాహుల్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు ఊరటను కల్పించింది. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది. అయితే, ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని రాహుల్ కు సుప్రీంకోర్టు హితవు పలికింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ పై ఉన్న అనర్హతను లోక్ సభ సెక్రటేరియట్ ఎత్తివేసింది. రాహుల్ మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టనుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Related posts

కొత్త చట్టాలపై విపక్షాలది అనవసర రాద్ధాంతం …హోంమంత్రి అమిత్ షా…!

Ram Narayana

 పీవోకే కోసం 24 సీట్లు రిజర్వ్ చేశాం… కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Ram Narayana

 ప్రధాని మోదీ ఏమైనా దేవుడా? ఆయన వస్తే ఏమవుతుంది?: మల్లికార్జున ఖర్గే

Ram Narayana

Leave a Comment