Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం కార్పొరేషన్ లో బీఆర్ యస్ వర్సెస్ కాంగ్రెస్ ఢీ…!

ఖమ్మం కార్పొరేషన్ లో బీఆర్ యస్ వర్సెస్ కాంగ్రెస్ ఢీ…!
ఊకదంపుడు ఉపన్యాసాలు కట్టిపెట్టండని అధికార బీఆర్ యస్ కార్పొరేటర్లకు ఆడ్డుతగిలిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
కార్పొరేషన్ లో వాడి.. వేఢీ చర్చ
సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
కార్పొరేషన్ ముందు బైఠాయింపు …నిరసన …

ఖమ్మం కార్పొరేషన్ లో అధికార బీఆర్ఎస్, ప్రతి పక్ష కాంగ్రెస్ మాటల యుద్ధం సాగింది. ఒక సందర్భంలో ఢీ అంటే ఢీ అనే సాగింది సమావేశం … కౌన్సిల్ హాల్ లో మేయర్ నీరజ అధ్యక్షతన కార్పొరేషన్ పాలకవర్గ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. సభలో మేయర్ సహా బి ఆర్ఎస్ కార్పొరేటర్లు ఖమ్మం నగర అభివృద్ధిపై మాట్లాడారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కృషితో నగర అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాలని, అధికార పార్టీ ఊకదంపుడు ప్రసంగాలు సరికాదని కాంగ్రెస్ కార్పొరేటర్ మంజుల ఇతర కాంగ్రెస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తూ బయటకు వచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల , మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, దొడ్డ నగేష్ , దుద్దుకూరి వెంకటేశ్వర్లు , రఫిదా బేగం తదితరులు

కార్పొరేషన్ కార్యాలయం లోపల ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్ అక్రమాలపై దృష్టి సారించాలని, ప్రోటోకాల్ పాటించాలని, కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశ వివరాలను మేయర్ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటన లో తెలియజేశారు. 22 అంశాలతో కూడిన ఎజెండాను సభ్యులు ఆమోదించడం జరిగిందన్నారు. కార్పొరేషన్ లోని 60 డివిజన్ల పరిధిలో ఆయా డివిజన్ల వారీగా చేపట్టిన అభివృద్ది పనులు, చేపట్టబోయే పలు నిర్మాణాభివృద్ధి పనులకు నిధులు,కావాల్సిన మౌళిక సదుపాయాలు, డివిజన్ లలో నెలకొన్న పలు సమస్యలు,వాటి పరిష్కారానికి కృషి,వంటి పలు కీలక ప్రధాన అంశాలపై ప్రజాప్రతినిధుల సలహాలు,సూచనలతో చర్చను సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార , బి.ఆర్.ఎస్. ఫ్లోర్ లీడర్ కర్నాటి క్రిష్ణ, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మేనేజర్. విజయానంద్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ రంజిత్, మున్సిపల్ ఈ ఈ కృష్ణాలాల్, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, మలేరియ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లోకేష్ , బిల్ కలెక్టర్ జగదీష్ లు ఇద్దరు ప్రైవేట్ సిబ్బంది సతీష్ , నరేశ్ లను ఏర్పాటు చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. సదరు సిబ్బంది దర్జాగా కార్పొరేషన్ కార్యాలయంలో కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటోల ప్లే కార్డులను ప్రదర్శించారు.

కాంగ్రెస్ కండువా ఏది ? : నగరంలోని 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డా నగేష్ స్వతంత్ర కార్పొరేటర్ గా గెలిచారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్ట్రాంగ్ ఫాలో వర్ గా ఉన్నారు. కౌన్సిల్ సమావేశం బాయ్ కాట్ చేసి బయటకు వచ్చిన తరువాత కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మరో వైపు కొందరు కార్పొరేటర్లు సరదాగా సంభాషించుకున్నారు . సహచర కార్పొరేటర్ నగేష్ తో 49వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశం జరిగే సమయంలో ఇంకా ఇండిపెండెంట్ కార్పొరేటర్ అనడం సరి కాదని , కాంగ్రెస్ కార్పొరేటర్ అనాలని అన్నారు. అసలు మీరు నాకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పరా అని నగేష్ ప్రశ్నించారు.

ఏకైక బీజేపీ కార్పొరేటర్: నగరంలో ఏకైక బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు. బి.ఆర్.ఎస్. x కాంగ్రెస్ కార్పొరేటర్లు వాదులాట అనంతరం కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. కమలం కార్పొరేటర్ సైలెంట్ గానే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Related posts

కమ్మకులం తలవంచుకునే పనిచేయను …భద్రాచలంలో మంత్రి తుమ్మల

Ram Narayana

మధిర భట్టి ప్రచారంలో కీలకం “మేడం నందిని” ..

Ram Narayana

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతం… 70 శాతం పైగా పోలింగ్…

Ram Narayana

Leave a Comment