Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు

  • చంద్రబాబుకు రిమాండ్
  • టీడీపీ అధినేతను రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం
  • ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధిస్తున్న తీర్పు వెలువరించిన అనంతరం… ఇదే కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో, చంద్రబాబును రాజమండ్రి కారాగారానికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ పోలీసు వాహనం నేరుగా కోర్టు  ప్రాంగణంలోకి ప్రవేశించింది.

Related posts

జైల్లో చంద్రబాబుకు టవర్ ఏసీ… ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

Ram Narayana

ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోయంబత్తూర్ కోర్టు.. ఆయన చేసిన నేరం ఏమిటంటే..?

Ram Narayana

కోర్టు హాలులో చంద్రబాబు, సీఐడీ న్యాయవాదుల మధ్య మాటల యుద్ధం.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి!

Ram Narayana

Leave a Comment