Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కాంగ్రెస్ లో టిక్కెట్ల కొట్లాట …అరుపులు కేకలతో దద్దరిల్లిన ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం

కాంగ్రెస్ లో టిక్కెట్ల కొట్లాట …అరుపులు కేకలతో దద్దరిల్లిన ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం
కాంగ్రెస్ లో బీసీ టికెట్ రగడ…విహెచ్ ప్రసంగాన్ని అడ్డుకున్న కార్యకర్తలు
ఎన్నికల పరిశీలకుల ముందే గొడవ…తలలు పట్టుకున్న నేతలు
వేదికపై నుంచి వెళ్లిపోయిన భట్టి ,పొంగులేటి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనం లో ఏర్పాటు చేసిన ఈసమావేశానికి జిల్లాలోని కాంగ్రెస్ అతిరథ మహారధులు హాజరైయ్యారు . సీఎల్పీ నేత భట్టితోపాటు ,మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి , కాంగ్రెస్ ప్రచార కమిటీ కో -చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ పీసీసీ అధ్యక్షులు విహెచ్ ,కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ ఏఐసీసీ ఇంచార్జి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తదితరులు హాజరైయ్యారు .. ఈసందర్భంగా 17 న హైద్రాబాద్ లో జరిగే విజయభేరి సభ కన్నా టిక్కెట్లలు ఎవరికీ వస్తాయనే ఆలోచనతోనే సమావేశం రసాభాసగా మారింది…ఒక సందర్భంలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు ..జై రాయల , జై పోట్ల , జై పొంగులేటి , లాంటి నినాదాలతో కాంగ్రెస్ కార్యాలయం దద్దరిల్లింది …వీరి ప్రవర్తన కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళను కంగు తినిపించగా , పాటవాళ్ళు ఇది మాపార్టీలో మాములే అన్నారు .

ఏఐసీసీ నుంచి వచ్చిన ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు ఆరీఫ్ నసీమ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి , మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, భద్రాచలం ఎమ్మెల్యే పొందే వీరయ్య పాల్గొన్నారు. 17న జరిగే సి. డబ్ల్యూ. సి. మీటింగ్, బహిరంగ సభ ఇతర అంశాలపై మాట్లాడుతుండగా ఈ జిల్లాలో మీ కో అర్డినేషన్ ఏమిటి అంటూ విహెచ్ పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వారిస్తుండగా కార్యకర్తలు గోడవకు దిగారు. తీవ్ర వాగ్వివాదం.. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గో బ్యాక్ విహెచ్ అంటూ ఓ వర్గం నినాదాలు చేశారు. మరో వర్గం ఉమ్మడి ఖమ్మంలో మూడు జనరల్ స్థానాల్లో ఒక్కటైన బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు , కార్యకార్యకర్తల నినాదాల మద్యే నేతలు ప్రసంగించారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు ఆరీఫ్ నసీమ్ ఖాన్ మాట్లాడుతూ … కాంగ్రెస్ కి ఒక చరిత్ర ఉందన్నారు. అసెంబ్లీల వారీగా సమీక్షలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అన్నారు. ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని టి(బి)ఆర్ఎస్ కి అధికారం కట్టబెట్టారని , పదేళ్ళ లో సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ బిజెపి కి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర కి కేసీఆర్ వచ్చాడు డబ్బుల ప్రలోభాలతో స్థానిక నేతలను‌‌ కొంటున్నాడని ఆరోపించారు.

అన్ని వందల కోట్లు కేసీఆర్ కు ఎక్కడవి అని ప్రశ్నించారు. మాజీ మంత్రి రేణుక మాట్లాడుతూ జిల్లాలో కొంచెం మా నేతల మనోభావాలు చేదిరాయని అన్నారు. 30, 40 ఏళ్ళు పార్టీ జెండా మోసినోళ్ళకు ప్రియార్టీ ఇవ్వలేదన్నారు. తప్పుడు సమాచారాలు, తప్పుడు నివేదికలు ఇచ్చి కొంత మందికి అన్యాయం చేశారని తెలిపారు. ఎవరు ఏం చేసినా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోటని అన్నారు. కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ముస్తాఫాపై అక్రమ కేసులు పెట్టి చెంచెల గూడ జైల్లో పెట్టారు. ఖబర్దార్ మంత్రి పువ్వాడ అజయ్.. నీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారని, బ్రద్రర్స్ మీరు మారండి అంటూ పోలీసులకు హితవు పలికారు. గాలి కాంగ్రెస్ వైపు మారింది.. వచ్చేది మా ప్రభుత్వమన్నారు. మాజీ ఎంపీ పోంగులేటి శ్రీ నివాస రెడ్డి మాట్లాడుతూ
ఇది మన కుటుంబం.. గొడవలు వద్దని హితవు పలికారు. పెద్దవాళ్లందరిని గౌరవించుకోవాలని , మనం ఒక్కళ్లమే కాదు..పార్టీ అంటే అందరూ ఉండాలన్నారు. ఇది మన సభ.. ఎదో శత్రువు సభలా కోట్లాడితే ఏలా? 17న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. అధికారం వచ్చాక కోట్లాడుకుందాం..పోట్లాడుకుందా..అధికారం వచ్చిన తరువాత చూసుకుందాం ఇప్పటికే చాలా పలుచునవుతున్నాం.. పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు..
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలంతా ఒకే వేదిక మీదకు వస్తామన్నారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికి సీఎల్పీ నేత మల్లు భట్టి అగ్ర నేతల జామ్ మీటింగ్ ఉందని బయటకు వెళ్లారు. తన ప్రసంగం అనంతరం పొంగులేటి బయటకు వెళ్లారు. గందరగోళం మద్యే సభ పూర్తి చేశారు.

Related posts

ఖమ్మంలో ఘనంగా ఎన్టీఆర్ వర్దంతి …వివిడిగా..కలివిడిగా కాంగ్రెస్ టీడీపీలు..

Ram Narayana

ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రకు పెరుగుతున్న ఆదరణ …

Ram Narayana

ఖమ్మంలో సి సి ఏ ఆధ్వరంలో పాలస్తీనా కు సంఘీభావం…

Ram Narayana

Leave a Comment