Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పొంగులేటి ,నేను ఇద్దరం ఒక్కటే…పాలేరు ,ఖమ్మం మాకు రెండు కళ్ళు… తుమ్మల …

పొంగులేటి ,నేను ఇద్దరం ఒక్కటే…పాలేరు ,ఖమ్మం మాకు రెండు కళ్ళు… తుమ్మల …

  • శ్రేణులకు ఎప్పుడూ అండగా ఉంటాం
  • కాంగ్రెస్ విజయమే మా ఉమ్మడి లక్ష్యం
  • ఏ కష్టమొచ్చినా మేమున్నాం: మాజీ ఎంపీ పొంగులేటి
  • ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో పాలేరు నియోజకవర్గ నాయకుల సమావేశం
  • “నాకు ఖమ్మం అయినా… రెడ్డి గారికి పాలేరు అయినా.. మా ఇద్దరికీ ఒక్కటే. అక్కడ ఆయన, ఇక్కడ నేను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇద్దరం ఒక్కటిగా ముందుకెళతాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి’ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడారు. పాలేరుకు పెద్ద పాలేరుగా ఉంటానన్న మాట నిలుపుకున్నానని, ఇప్పుడు రెడ్డి గారు కూడా అదేరకంగా అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా ఇన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నామని, భవిష్యత్తులోనూ ఇదే పద్ధతిని పాటిస్తామని తెలిపారు.
  • తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేకమంది రెచ్చగొడతారని, ఎలాంటి పట్టింపులకు పోకుండా కాంగ్రెస్ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం లేకున్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక కేసులతో భయభ్రాంతులకు గురిచేసినా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటామని అభయమిచ్చారు. కాంగ్రెస్ లో అంతా సమిష్టిగా పనిచేసి నిరంకుశ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా విజయం అందించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మాయమాటలతో ఇన్నేళ్లు పాలన సాగించారని విమర్శించారు. అధికార మదం నెత్తికెక్కి అహంకారంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ ను ఇంటికే పరిమితం చేయాలని కోరారు. జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్ అంటూ తుమ్మల, పొంగులేటి నినాదాలు చేసి శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, సాధు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా అవశేషాలు ఉన్నాయంటూ భారత్ నుంచి రొయ్యల దిగుమతి నిలిపివేసిన చైనా….

Drukpadam

ముంద‌స్తు ముచ్చ‌టే లేదు!… తేల్చేసిన సీఎం కేసీఆర్‌!

Drukpadam

మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా ‘శ్రీశ్రీ’ కుమార్తె నిడుమోలు మాలా!

Drukpadam

Leave a Comment