Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు బ్యారక్ లోకి గంజాయి వేశారు.. పెన్ కెమెరాతో చంద్రబాబు కదలికలు రికార్డ్ చేశారు: న్యాయవాది లక్ష్మీనారాయణ ఆరోపణ…

చంద్రబాబు బ్యారక్ లోకి గంజాయి వేశారు.. పెన్ కెమెరాతో చంద్రబాబు కదలికలు రికార్డ్ చేశారు: న్యాయవాది లక్ష్మీనారాయణ ఆరోపణ..
జడ్ ప్లస్ సెక్యూరిటీ వ్యక్తికి భద్రత లేకుండా చేశారన్న లక్ష్మీనారాయణ
జైల్లోకి పెన్ కెమెరా ఎలా వచ్చిందని ప్రశ్న
బాబు కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారని విమర్శ
జైల్లో చంద్రబాబు పరిస్థితిని న్యాయమూర్తి వెంటనే పరిశీలించాలి: యనమల

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు… జైల్లో తనకు ప్రాణహాని ఉందంటూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ఆయన తరపు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు,స్పందించారు.

తన అనారోగ్య పరిస్థితి, జైల్లో భద్రతపై ఉన్న అనుమానాలను లేఖలో చంద్రబాబు పేర్కొన్నారని చెప్పారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి జైల్లో భద్రత లేకుండా చేశారని విమర్శించారు. చంద్రబాబు బ్యారెక్ లోకి గంజాయి వేశారని, ఆయన కదలికలను పెన్ కెమెరాతో చిత్రీకరించారని చెప్పారు. జైల్లోకి పెన్ కెమెరా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బాబు కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారని చెప్పారు.

గత చంద్రబాబు పర్యటనలో ఆయన కాన్వాయ్ పైకి రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారని చెప్పారు. బాబు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబుకు జైల్లో అన్ని సదుపాయాలు లభిస్తున్నాయని వైసీపీ నేతలు చెపుతున్నారని… అంటే వైసీపీ నేతలు చంద్రబాబు కదలికలను మానిటరింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

జైల్లో తన ప్రాణాలకు హాని ఉందని, జైల్లో తగిన భద్రత లేదని చంద్రబాబే స్వయంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చెప్పారని, ఆయనకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించిందా లేదా అని న్యాయమూర్తి వెంటనే పరిశీలించాలని యనమల విజ్ఞప్తి చేశారు.

జైలుపై గతంలో డ్రోన్ తిరిగిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపించారు. చంద్రబాబు జైల్లో ఉన్నారనే కంటే ప్రభుత్వ కస్టడీలో ఉన్నారని చెప్పడమే కరెక్ట్ అని స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత జైలుకు వెళ్లినప్పటినుంచీ ఆయన విషయాలన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జలే పర్యవేక్షిస్తున్నాడని విమర్శించారు. జైలు అధికారులు, వైద్యులు, ఇతరులు ఏం చేయాలో… ఏం మాట్లాడాలో అంతా సజ్జలే నిర్ణయిస్తున్నాడని యనమల ఆరోపించారు.

వైద్యులు ప్రతిరోజు చంద్రబాబుని పరీక్షించాక ఆయన ఆరోగ్య సమాచారం ఎందుకు బహిర్గతం చేయడంలేదు? అంటూ యనమల నిలదీశారు. డాక్టర్లు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టుని కాదని జైలర్ ధ్రువీకరించిన రిపోర్టుని ఎందుకు మీడియాకు చూపిస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసే పెద్ద బోగస్ కేసు… రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని ప్రజలు గ్రహించారని యనమల వ్యాఖ్యానించారు.

Related posts

జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట తప్పదు…

Drukpadam

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ…సీఎల్పీ నేత భట్టి ధ్వజం

Drukpadam

15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. బాంబు పేల్చిన షబ్బీర్ అలీ

Drukpadam

Leave a Comment