Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

 హైదరాబాద్ లో 6.5 కోట్ల నగదు పట్టివేత…అవి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడివేనా …? 

  • ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున పట్టుబడుతున్న డబ్బు
  • అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో నగదు పట్టివేత
  • ఖమ్మం జిల్లా నాయకుడిదిగా అనుమానం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ వద్ద ఏకంగా రూ. 6.5 కోట్ల డబ్బు పట్టుబడింది. ఆరు కార్లలో ఈ నగదును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడిది అని అనుమానిస్తున్నారు. నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే డబ్బు ఎవరిదీ అనేది ఇంకా పోలీసులు చెప్పనప్పటికీ అవి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడివి అని అంటున్నారు …ఎన్నికలలో ఖర్చు చేసేందుకు వాటిని ఖమ్మంకు తరలిస్తున్నారని అనుమానిస్తున్నారు … దీనిపై ఖమ్మం జిల్లా నేతలు ఎవరు స్పందించలేదు
అధికార పార్టీకి చెందిన నాయకుడిగావిగా కొందరు అంటుంటే లేదు ప్రతిపక్ష నాయకుడివి అని మరికొందరు అంటున్నారు ..

Related posts

వీఆర్ఏలతో చర్చల కోసం కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం

Drukpadam

ఖమ్మం ఎంపీ నామ కృషి ఫలితం …ఉమ్మడి ఖమ్మం జిల్లా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు …

Ram Narayana

కేసీఆర్ కోరుకున్నట్లుగానే మిమ్మల్ని అధ్యక్షుడిగా చేశారనే విమర్శలపై కిషన్‌రెడ్డి సమాధానం !

Drukpadam

Leave a Comment