Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

కేరళ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురి మృతి

  • కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఘటన
  • కళాశాలలో టెక్ ఫెస్ట్ జరుగుతుండగా అకస్మాత్తుగా వర్షం
  • వర్షం మొదలవడంతో వేదిక బయటున్న వారు ఒక్కసారిగా లోపలికి రావడంతో తొక్కిసలాట
  • 64 మందికి గాయాలు, ఘటనపై సీఎం పినరయి విజయన్ సంతాపం

కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ‌లో(సీయూఎస్ఏటీ) జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతిచెందగా మరో 64 మంది గాయపడ్డారు. శనివారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన టెక్ ఫెస్ట్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి పాసులున్న వారినే అనుమతించారు. అయితే, అకస్మాత్తుగా వర్షం మొదలవడంతో వేదిక బయటున్న వారు లోపలికి రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. గాయపడిన వారికి కాలామస్సేరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో వివిధ శాఖల మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది. ఘటనపై మంత్రివర్గం విచారం వ్యక్తంచేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేసింది.

Related posts

పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన…కుట్రకోణం ఉందనే దిశగా పోలీసులకు ఫిర్యాదు!

Ram Narayana

యూపీలో పట్టాలు తప్పిన చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు…

Ram Narayana

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం…

Ram Narayana

Leave a Comment