కమ్యూనిజం అజేయం అజరామరం …సిపిఐ జాతీయనేత భాగం…
కమ్యూనిస్టుల పురోగమనం తప్పదు : బాగం
పార్టీ కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన పువ్వాడ ఘనంగా సి.పి.ఐ 99వ ఆవిర్భావదినోత్సవం

కమ్యూనిజం అజేయం …అజరామరం భోగోళం ఉన్నంతవరకు కమ్యూనిజం ఉంటుంది …ఎర్ర జెండా పేదలకు , కార్మికులకు కర్షకులకు ,అండగా ఉంటుంది….భారతదేశంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిది …విరోచితమైంది …ఎక్కడ పీడన ఉంటుందో అక్కడ ఎర్రజెండా ఉంటుంది…
స్వాతంత్య్రానికి పూర్వం , స్వతంత్రం వచ్చిన తరువాత కమ్యూనిస్టుపార్టీ చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు గర్వించదగ్గవి . దేశంలో కమ్యూనిస్టుల అవరం పెరుగుతుందని , కులం , మతం , రాజకీయ అంశాలుగా మారగా డబ్బు ప్రభావితం చేస్తున్నదని ఇటువంటి దశ నుంచి మార్పు రాకతప్పదని ఆ క్రమంలో కమ్యూనిస్టులు పురోగమిస్తారని సి.పి.ఐ జాతీయ సమితిసభ్యులు బాగం హేమంతరావు తెలిపారు.
భారత కమ్యూనిస్టుపార్టీ (సి.పి.ఐ) 99వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పార్టీకార్యాలయం గిరిప్రసాద్భవన్లో ఆరుణ పతాకాన్ని సి.పి.ఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హేమంతరావు మాట్లాడుతూ భారతదేశ వ్యాపితంగా అనేక విరోచితపొరాటాలు కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిందని అందులో సాయుధ తెలంగాణ పోరాట మొకటన్నారు. కేరళ, కర్ణాటక, బెంగాల్తో పాటు అనేక చారిత్రక పోరాటాలకు కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం వహించిందన్నారు. చట్టసభల ద్వారా అనేక హక్కులను సాధించిందని రైతుల, వ్యవసాయ కార్మికుల సంబంధించిన అనేక సాధించిందని ఇప్పుడు రాజ్యాంగ బద్దంగా ప్రజలు అనుభవిస్తున్న అనేక హక్కుల వెనుక కమ్యూనిస్టుపార్టీ పోరాటం వుందన్నారు. అటవీ హక్కుల చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం సహా కమ్యూనిస్టుపార్టీ పోరాట ఫలితమేనన్నారు. ప్రపంచ ప్రజలు భారతదేశానికి సంబంధించిన ఏ రాజ్యంగా విలువలను గుర్తించి గౌరవిస్తారోఆ రాజ్యంగానికి బీజేపీ తూట్లు పొడుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ప్రజల హక్కులను హరించాలని, ప్రశ్నించే తత్వాని చంపేయాలని చూస్తున్నదని హేమంతరావు ఆరోపించారు. పార్లమెంట్ లోపల ప్రశ్నించే ఎం.పిలను బష్కరిస్తున్నారని పార్లమెంట్ వెలుపల ప్రశ్నించే వారిని జైళ్ళకు పంపుతున్నారన్నారు. బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదని ఆప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తూ మోడీ నియంతాల వ్యవహరిస్తున్నారన్నారు. నిరంతరం ప్రజా పక్షాన నిలుబడి ప్రజల సమస్యల పరిష్కారంకోసం పోరాడుతున్న పార్టీ కమ్యూనిస్టుపార్టీ అని, రానున్న కాలంలో ప్రజల దన్నుతో మరింతగా పురోగమించక తప్పదని హేమంతరావు స్పష్టంచేశారు. ఈ కార్యకర్యక్రమంలోసిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితిసభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్.కె. జానిమియా, సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గసభ్యులు, బి.జి. క్లెమెంట్, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు గాదె లక్ష్మినారాయణ, నానబాల రామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, తాటి నిర్మల, మందా వెంకటేశ్వర్లు, బోదా వీరన్న, బి.శ్రావణ్, ఎస్.కె. జాకీర్, బోజెడ్ల సూర్యం, యానాలి సాంబశివారెడ్డి, పీట్లకృష్ణమూర్తి, జ్వాలనర్సింహారావు, శ్రీనాథరెడ్డి, సామినేని సుధాకర్, ఎస్.కె. చానా, సిద్ది శ్రీనివాసరావు , శేఖర్ , డి. సురేష్ తదితరులుపాల్గొన్నారు.