Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

నాగెలుపులో ప్రధానపాత్ర వహించి 50 వేల మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు శాల్యూట్ ..! మంత్రి తుమ్మల

ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన నాకు ఎన్నడూ లేనిది 50 వేల మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శాల్యూట్ చేస్తున్నానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు … నాకు మద్దతు ఇచ్చిన పార్టీల మేలు మర్చిపోలేనని వారికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెపుతున్నట్లు తెలిపారు ..బుధవారం ఖమ్మంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ లెవల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కార్యకర్తలు ఎంతో పట్టుదలతో అవతలివాడు బెదించడానికి ప్రయత్నం చేస్తే రండిరా ..చూసుకుందాం అని కర్ర పట్టుకొని ఎదురొడ్డి నిలిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు …అందుకనే అనేకమంది అవతల పార్టీ వాళ్ళు ఇందులో జొరబడేందుకు చూస్తున్నారు …వారు వస్తే ఈకుర్చీలు మీరు కూర్చోవడానికి మిగలవు …అందువల్ల స్థానిక పార్టీ నాయకుల అనుమంతి లేకుండా ఎవరిని పార్టీలో చేర్చుకునేది లేదని నిష్కర్షగా చెపుతున్నట్లు పేర్కొన్నారు … కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కష్టపడి,అవినీతి,అక్రమ,దుర్మార్గపు పాలన అంతమొందించడం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టీ పోరాడిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం దక్కాలని,వారి అనుమతి లేకుండా కొత్త వారిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు…. మిగతా ఇద్దరు మంత్రులకు కూడా ఇదే చెప్పానని నా విధానం ఇదేనని స్పష్టం చేశారు ..నియోజకవర్గ చరిత్రలో 50 వేల మెజార్టీ ఎన్నడూ రాలేదు …ప్రత్యర్థుల దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞడనని అన్నారు …కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇంట్లో నుంచి బయటకు వెళ్లని అనేకమంది పక్కకు వేసిన ఖద్దరు చొక్కాలకు పనిచెప్పారు …వారందరి ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు తెలుపుతానని అన్నారు …

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు అనేక అవాకులు,చవాకులు పేలుతున్నారు,ఎమ్మెల్యేలను కొంటాం త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ మమ్మల్ని,మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు మీకు లేవు,మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ బంగళాఖాతంలో కలిసి పోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు…..

గత పది సంవత్సరాలుగా అధికారం లేకపోయినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ఎన్ని నిర్బంధాలు,అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను…..

గత ప్రభుత్వంలో జరిగినట్లు అవినీతికి,అక్రమాలకు తావులేకుండా నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు చేరెలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు….

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా కాంగ్రెస్ నాయకులు మానుకోండ రాధా కిషోర్,సాడు రమేష్ రెడ్డి, నాగండ్ల దీపక్ చౌదరి,షేక్ అబ్దుల్ రషీద్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…..

హైద్రాబాద్ లాల్ బహదూర్ స్టేడియం లో ఏఐసీసీ అధ్యక్షులు హాజరు కానున్న సమావేశానికి ఖమ్మం నియోజకవర్గం నుంచి మూడు వందలమంది బూత్ స్థాయి నాయకులూ వెళ్లాలని అన్నారు .. దీనికి సంబందించిన భాద్యతలు నగర అధ్యక్షులు జావేద్ చేసుకుంటారని మంత్రి తెలిపారు ..

Related posts

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తా….మంత్రి తుమ్మల

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల కృతజ్ఞత లేఖ..యధాతధంగా…

Ram Narayana

పాలేరు గడ్డపై పొంగులేటి విజయగర్జన …పాలేరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభం …!

Ram Narayana

Leave a Comment