Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

తెలుగుదేశం పార్టీతో నా అనుబంధం ఎవరు వేరు చేయలేనిది …ఎంపీ నామ

  • ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీకి లేఖ రాశా
  • స్వర్గీయ ఎన్టీఆర్ స్పూర్తితో, చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చా
  • పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు నా నేతృత్వం లో జరగడం అదృష్టంగా బావిస్తున్న
  • బాబ్లీ ధర్నా లో చంద్రబాబు మీద పడపోయే లాఠీ దెబ్బకు అడ్డు వెళ్లి పోలీస్ లాఠీ దెబ్బ తిన్న చరిత్ర టీడీపీ లో నాది
  • రాజకీయాలకు అతీతంగా టీడీపీ కుటుంబ సభ్యులకు అండగా ఉన్న భవిష్యత్ లో కూడా అండగా నిలబడుతా
  • పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు సహకరించండి.

తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం విడదీయలేనిదని ,ఎవరు వేరు చేయలేరని ఖమ్మం పార్లమెంట్ కు బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు అన్నారు .. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్పూర్తితో, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానని నామ స్పష్టం చేశారు… శనివారం నాడు ఉదయం ఖమ్మం లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి వెళ్లిన ఆయన అక్కడ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు డా. వాసిరెడ్డి రామనాథం తో కలసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు… అనంతరం అక్కడ టీడీపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తాను ఎంపీ గా ఉండి పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం కృషి చేసి పట్టుబట్టి పార్లమెంట్ హాల్ లో అన్న విగ్రహాన్నిపెట్టించడం జరిగిందని అందుకు చాలా గర్వంగా, అదృష్టంగా బావిస్తున్న అన్నారు… అలానే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీ గారికి లేఖ రాయడం జరిగిందన్నారు. ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినేలా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారి అద్వర్యం లో వెళ్లి పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయడం జరిగిందని ఆ సమయం లో అక్కడ పోలీసులు చేసిన లాఠీ ఛార్జ్ లో చంద్రబాబుకు తగలబోయిన లాఠీ దెబ్బకు అడ్డు వెళ్లి ఆ లాఠీ దెబ్బ తిన్న చరిత్ర తెలుగుదేశం పార్టీలో తనది అన్నారు. రాజకీయాలకు అతీతంగా టీడీపీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగానే ఉన్నానని భవిష్యత్ లో కూడా అలానే ఉంటానని వారి హర్షద్వానాల మధ్య తెలిపారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనాడు చేపట్టిన సైకిల్ యాత్రను, బాబు పాదయాత్ర సందర్భంగా పైలాన్ ఏర్పాటు సహా పలు విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. జిల్లాలో ఎన్నో చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహాల ఏర్పాటు సహా పార్టీ కార్యాలయాల నిర్మాణం లో తన పాత్ర ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలను గమనించి టీడీపీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొండబాల కరుణాకర్, తాళ్లూరి అప్పారావు, సానెబోయిన శ్రీను, పాలడుగు కృష్ణప్రసాద్, నల్లమల రంజిత్, మందటి నరేష్, వకుంతల వంశీ, మందపల్లి కోటి, కూచిపూడి జై, రజని, స్వప్న, నల్లమల శ్రీను, దామా శ్రీను సహ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

బీఆర్ యస్ ఖమ్మం లోకసభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు శనివారం టీడీపీ ఖమ్మం జిల్లా కార్యాలయానికి వెళ్లారు …ఎన్నికల్లలో టీడీపీ పోటీచేయనందున ఇక్కడ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు …టీడీపీతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేశారు …దీంతో టీడీపీ శ్రేణులు నామకు జైకొట్టాయి….ఆయనకు కూడా టీడీపీ కార్యకర్తలు నాయకులతో కలివిడిగా మాట్లాడి కరచాలనం చేశారు …సెల్ఫీలు దిగారు …నామ పట్ల వారు సానులకులత వ్యక్తం చేయడంతో నామ వారికీ కృతజ్ఞతలు తెలిపారు ..

Related posts

ఇది ప్రజాగెలుపు రామసహాయం విజయంపై మంత్రి పొంగులేటి స్పందన …

Ram Narayana

కాంగ్రెస్ లో టిక్కెట్ల కొట్లాట …అరుపులు కేకలతో దద్దరిల్లిన ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం

Ram Narayana

అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి….

Ram Narayana

Leave a Comment