Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మల్లన్న గెలుపుకు సహకరించాలి …సిపిఎం , సిపిఐ, పార్టీలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి ..!

ఖమ్మం , నల్గొండ , వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నికలో చింతపండు నవీన్ ఎలియాస్ తీన్మార్ మల్లన్న గెలుపుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం , సిపిఐ పార్టీలకు విజ్ఞప్తి చేశారు …శనివారం హైద్రాబాద్ లో ఆపార్టీ నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి గెలుపు ఆవశ్యకత గురించి నేతలు వివరించారు …రాష్ట్ర రాజకీయ పరిస్థితులు , బీజేపీ ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు చర్చించారు …పట్టభద్రుల ఉపఎన్నిక జరుగుతున్నఉమ్మడి ఖమ్మం , నల్గొండ , వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉండటంతో వారి అవసరాన్ని గుర్తించిన సీఎం వారితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది …

సీఎం తో సమావేశంలో సిపిఐ సిపిఎం తోపాటు టీజేఎస్ నేతలు కూడా పాల్గొన్నారు … సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యంగా నల్గొండ ఖమ్మం జిల్లాల్లో బలంగా ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతల ద్వారా గ్రాడ్యుయేట్లకు మరింత చేరువ కావాలని సిఎం వారిని కోరారు ఈ సమావేశం ప్రొ కోదండరామ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పల్లా వెంకటరెడ్డి సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి బాగం హేమంతరావు , మల్లు రవి, వేం నరేందర్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

Related posts

కుటుంబ డిజిటల్ కార్డుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్ట్ …సీఎం రేవంత్ రెడ్డి !

Ram Narayana

తన కోసం వేసిన కుర్చీని మార్పించిన చంద్రబాబు.. కారణం ఇదే!

Ram Narayana

ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు ఓమిక్రాన్ ఎఫెక్ట్..!

Drukpadam

Leave a Comment