Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూలిన స్టేజీ…

  • పాట్నా శివారులోని పాలీగంజ్ బహిరంగసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ
  • వేదికపైకి వచ్చిన తేజస్వి యాదవ్, రాహుల్, మీసా భారతి
  • హఠాత్తుగా కిందకు పడిపోయిన స్టేజీ
  • అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభలో స్టేజీ కూలింది. అయితే రాహుల్ గాంధీ సహా ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బీహార్‌లోని పాటలీపుత్ర లోక్ సభ స్థానానికి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా పాట్నా శివారులోని పాలీగంజ్‌లో బహిరంగసభలో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, మీసా భారతి తదితరులు వేదిక పైకి చేరుకున్నారు. ఈ సమయంలో వేదిక ఒక్కసారిగా కాస్త కిందకు పడిపోయింది. దీంతో రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది అతనిని కిందకు దించే ప్రయత్నాలు చేశారు. దానికి ఆయన వద్దని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. స్టేజ్ కూలిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Related posts

రోడ్డుపై వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు నుంచి ఎగసిపడ్డ మంటలు.. కారు దగ్ధం

Ram Narayana

వైరా మండలం సోమవారం వద్ద కూలిన స్లాబ్ పోస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి…

Ram Narayana

 మధ్యప్రదేశ్‌లో బస్సు-డంపర్ ఢీ.. మంటలు చెలరేగి 12 మంది మృతి

Ram Narayana

Leave a Comment