Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టియుడబ్ల్యుజె రాష్ట్ర మహాసభలకు ఆహ్వానసంఘం ఆధ్వరంలో చురుగ్గా ఏర్పాట్లు…

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల19.20వ తేదిల్లో రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియుడబ్ల్యుజె –ఐజెయు) రాష్ట్ర మూడవ మహాసభలకు ఆహ్వాన సంఘం ఆధ్వరంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి… అధ్యక్షులుగా ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు,సామాజీకవేత్త కూరపాటి ప్రదీప్ వ్యవరిస్తుండగా సలహాదారుడిగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాంనారాయణ సలహాదారుడిగా టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు కోశాధికారిగా జిల్లాకు చెందిన టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా,రాష్ట్ర నాయకులు,ప్రముఖ జర్నలిస్టులు,ట్రేడ్ యూనియన్ నేతలతో కమిటీ ఏర్పడి పనిచేస్తుంది … ఈ కమిటీలో టియుడబ్ల్యుజె నాయకులు అమరవాది రవింద్ర శేషు,నర్వనేని వెంకట్రావ్,మాటేటి వేణుగోపాల్, నలజాల వెంకట్రావ్,సామినేని మురారీ,మైసపాపారావు,ఖదీర్,ఆవుల శ్రీనివాస్,కనకం సైదులు,మామిడాల భూపాల్,గోగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి,మహేందర్
మొహిద్దీన్ ,నామపురుషోత్తం,శివానంద,జనార్దనాచారి,కె.వి,చెరుకుపల్లి శ్రీనివాస్,ఏలూరి వేణుగోపాల్ రావు,కళ్యాణ్,అలస్యం అప్పారావు,జకీర్, కమటం శ్రీనివాస్ ,జిల్లా ,నగర కమిటి సభ్యులు ,ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోజర్నలిస్ట్ యూనియన్ ,ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నేతలు,పలు ట్రేడ్ యూనియన్ నేతలు తదితరులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర మహాసభలకు రెండు పర్యాయాలు అతిధ్యం ఇచ్చిన ఖమ్మ జిల్లా,తెలంగాణ ఏర్పాటు తరువాత తొలిసారిగా రాష్ట్ర మూడవ మహాసభకు మరోసారిఅతిధ్యం ఇవ్వబోతుంది.రాష్ట్ర డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతోపాటు మీడియా అకాడమి చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి,ఎంపిలు రేణుకచౌదరి, రామసహాయం రఘురాంరెడ్డి,వద్దిరాజు రవిచంద్ర,డాక్టర్ పార్ధసారధి రెడ్డి,మాజీ ఎంపి నామ నాగేశ్వర్ రావు,ఎమ్మెల్సీతాతామధు,జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు,నగర మేయర్ పునుకొల్లు నిరజ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం,సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు,తానా మాజీ అధ్యక్షులు జయశేఖఱ్ తాళ్ళూరి ,ఐజెయు నాయకులు బల్విందర్ సింగ్ జమ్ము, ఎస్ ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, ఎం ఏ మాజీద్, వై నరేందర్ రెడ్డి, డి సోమసుందర్, కల్లూరి సత్యనారాయణ, అలపాటి సురేశ్ కుమార్, నగునూరి శేఖర్,కె విరాహత్ అలీ తదితర నాయకులు పాల్గొంటారు.

8 సబ్ కమిటీల ఏర్పాటు

రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం పలువురు సీనియర్ జర్నలిస్టులతో 8 కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా టియుడబ్ల్యుజె (ఐజెయు) అధ్యక్ష ,కార్యదర్శులు వనం వెంకటేశ్వర్ల,ఏనుగు వెంకటేశ్వర్ రావు తెలిపారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.ఫూడ్ కమిటీ కన్వీనర్ గా సామినేని మురారీ,వసతుల కమిటీ కన్వీనర్ గా మాటేటి వేణుగోపాల్,ప్రోటోకాల్ కమిటి కన్వీనర్ గా నర్వనేని వెంకట్రావ్,ఫైనాన్షియల్ కమిటి కన్వీనర్ గా ఏనుగు వెంకటేశ్వర్ రావు, కో కన్వీనర్లుగా వనం వెంకటేశ్వర్లు, మాటేటి వేణుగోపాల్, ప్రచార కమిటి కన్వీనర్ గా మైసపాపారావు,మెమోంటోస్ ఆండ్ గిప్ట్ కమిటి కన్వీనర్ గా నల్లజాల వెంకట్రావ్,మీడియా కమిటి కన్వీనర్ గామొహిద్దీన్ ,కో కన్వీనర్ గా నామ పురుషోత్తం,రవాణ కమిటి కన్వీనర్ గా చెరుకుపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు.ప్రతి కమిటీలో అయిదుగురు నుంచి 8మంది సభ్యులు ఉన్నారు.ఆయా కమిటీలు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాయి.జిల్లాకు విచ్చేసే ప్రతినిధులకు ఏలాంటి లోటుపాట్లు లేకుండా అతిధ్యం ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు ..

Related posts

ఇటలీ, పోర్టోఫినో సిటీలో సెల్ఫీ దిగారంటే పాతిక వేలు ఫైన్..!

Drukpadam

బెంగాల్ , అస్సోమ్ లలో భారీ పోలింగ్ ఎవరికీ లాభం

Drukpadam

ఢిల్లీలో ఏపీ సీఎం ప్రదక్షణలు …కనికరించారా ? కస్సుమన్నారా ??

Drukpadam

Leave a Comment