Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

టికెట్ లేకుండా రైలు ప్రయాణం.. ప్రశ్నిస్తే కేంద్రమంత్రి తెలుసంటూ సమాధానం..

  • ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఘటన
  • కేంద్రమంత్రితో మాట్లాడితే వదిలేస్తానన్న టీటీ
  • తాను ఫోన్ చేస్తే ఆయన గుర్తుపడతారో లేదోనన్న ప్రయాణికుడు
  • చివరికి జరిమానా కట్టి వెళ్లిన వైనం

రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ప్రయాణికుడు చెప్పిన సమాధానం విని టీటీకి మతిపోయినంత పనైంది. ‘నన్నే టికెట్ అడుగుతావా? నాకు కేంద్రమంత్రి తెలుసు’ అని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జంక్షన్‌లో జరిగిందీ ఘటన. 

ధోలాపూర్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని మధుర రైల్వే స్టేషన్‌లో ఆపిన టీటీ టికెట్ అడిగాడు. దీంతో అతడు తనకు కేంద్రమంత్రితోపాటు పలువురు తెలుసని పేర్కొన్నాడు. దీంతో టీటీ ఒకసారి వారితో మాట్లాడిస్తే వదిలేస్తానని చెప్పాడు. అయితే, తాను ఫోన్ చేస్తే ఆ మంత్రి గుర్తుపడతారో, లేదోనని చెప్పడంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వుకున్నారు. అనంతరం టికెట్ లేకుండా ప్రయాణించినందుకు అతడికి జరిమానా విధించి వదిలిపెట్టారు.

Related posts

కర్ణాటక ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు బ్రేక్!

Ram Narayana

విపక్షాల విమర్శల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..

Ram Narayana

బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు…

Ram Narayana

Leave a Comment