Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

బీహార్‌లోని సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి…

  • మృతుల్లో ఆరుగురు మహిళలు.. 12 మందికిపైగా గాయాలు
  • శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయానికి పెద్ద ఎత్తున మహిళలు
  • రాత్రి 1.00 గంట సమయంలో తొక్కిసలాట

బీహార్‌లో ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మందికిపైగా గాయపడ్డారు. జెహనాబాద్ జిల్లాలోని వనవార్ హిల్స్‌లో ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో ఈ తెల్లవారుజామున 1.00 గంటకు జరిగిందీ ఘటన. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సదర్ ఆసుపత్రికి తరలించారు.

శ్రావణ మాసం నాలుగో సోమవారం (మనకి కాదు) పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండడం, సమయం  గడుస్తున్న కొద్దీ మరింత మంది భక్తులు వచ్చి చేరుతుండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

గోదావరిలో విహారయాత్ర.. నలుగురు యువకుల గల్లంతు

Ram Narayana

 అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికుల ఆర్తనాదాలు… ఇద్దరు చిన్నారుల మృతి..

Ram Narayana

సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం… వీడియో ఇదిగో

Ram Narayana

Leave a Comment