Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఓటుకు నోటు కేసు… ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

21-08-2024 Wed 15:14 | Both States

  • ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన ఆళ్ల
  • రాజకీయ కక్షలకు కోర్టును వేదికగా చేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచన
  • విచారణ జరిపిన జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం

ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణను కోరుతూ ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని… కోర్టులను వేదికగా చేసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

దాదాపు పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఆళ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది.

Related posts

 వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి సూర్యాపేట జిల్లాలో ప్రమాదం!

Ram Narayana

ఎన్టీఆర్ పేరు మీద చెల్లని నాణేన్ని విడుదల చేశారు: ఏపీ మంత్రి కారుమూరి

Ram Narayana

ఏపీ అనే పిలుస్తున్నారు.. అక్కడ తెలుగును సముద్రంలో కలిపేశారు: గరికపాటి

Ram Narayana

Leave a Comment