Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం.. ఎందుకంటే?

  • ఇస్లామాబాద్‌ వేదికగా సీహెచ్ జీ సమావేశం
  • షాంఘై సహకార సంస్థ నేతలకు పాక్ పిలుపు
  • గతేడాది బిష్కెక్ లో సీహెచ్ జీ సదస్సు

భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశానికి ఆహ్వానించింది. వచ్చే అక్టోబర్ లో నిర్వహించబోయే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్ జీ) సమావేశంలో పాల్గొనేందుకు రావాలని కోరింది. మోదీతో సహా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)కు చెందిన ఇతర నేతలనూ పిలిచింది. ఈ సదస్సును ఇస్లామాబాద్ లో నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది ఈ సమావేశం బిష్కెక్ లో జరగగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు.

ఏమిటీ సీహెచ్ జీ..
ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాల పర్యవేక్షణకు ఏర్పాటైందే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్ జీ). రష్యా, చైనా నేతృత్వంలోని సీహెచ్‌జీలో భారత్‌, పాక్‌ సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ దీనికి అధ్యక్షత వహిస్తోంది. అక్టోబర్‌ 15-16 తేదీల్లో సీహెచ్ జీ శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ప్రత్యక్షంగా పాల్గొనే వీలు కుదరని నేతల కోసం వర్చువల్ విధానం ఏర్పాటు చేస్తారా లేదా అనేది పాక్ ఇంకా వెల్లడించలేదు.

మోదీ సుముఖంగా లేరట..
పాకిస్థాన్ తో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు, అక్కడ భద్రతా ఏర్పాట్లపై అనుమానాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈసారి కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ ను పంపించే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. అయితే, జమ్మూలో ఇటీవలి ఉగ్రదాడుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి భద్రతపై నిఘా వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. 2015లో అప్పటి మన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ లో పర్యటించారు. అదే చివరి పర్యటన. ఆ తర్వాత భారత్ నుంచి కేంద్రంలోని పెద్దలు ఎవరూ పాక్ లో పర్యటించలేదు.

Related posts

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ యువతి దుర్మరణం

Ram Narayana

లండన్ ఆసుపత్రిలో పసికందులను చంపేస్తున్న నర్సును పట్టిచ్చిన భారత సంతతి వైద్యుడు

Ram Narayana

పైకి తెరిచాక మొరాయించిన లండన్ బ్రిడ్జ్.. అద్భుత ఘట్టమే అయినా గందరగోళం!

Ram Narayana

Leave a Comment