Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఛత్తీస్ గఢ్ లో దారుణం… చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య!

  • అనారోగ్యానికి గురైన ఓ కుటుంబంలోని వ్యక్తి 
  • చేతబడి వల్లనే అని భావించిన గ్రామస్తులు
  • ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అంతమొందించిన వైనం
  • మృతుల్లో ముగ్గురు మహిళలు

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ చేతబడి వంటి మూఢనమ్మకాలు తొలగిపోలేదు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర ఆచారాలకు ఎంతోమంది బలవుతున్నారు. తాజాగా, చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు హత్యకు గురయ్యారు. 

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. 

సుక్మా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్కల్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. చేతబడి వల్ల ఓ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడన్న అనుమానంతో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ ఆత్మహత్యాయత్నం…

Ram Narayana

ఈత కొలను స్నానాల గదిలో రహస్యంగా కెమెరా..

Drukpadam

వేశ్యల పాలిట యముడు… 14 మంది దారుణ హత్య

Ram Narayana

Leave a Comment