క్రైమ్ వార్తలు

ఛత్తీస్ గఢ్ లో దారుణం… చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య!

  • అనారోగ్యానికి గురైన ఓ కుటుంబంలోని వ్యక్తి 
  • చేతబడి వల్లనే అని భావించిన గ్రామస్తులు
  • ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అంతమొందించిన వైనం
  • మృతుల్లో ముగ్గురు మహిళలు

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ చేతబడి వంటి మూఢనమ్మకాలు తొలగిపోలేదు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర ఆచారాలకు ఎంతోమంది బలవుతున్నారు. తాజాగా, చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు హత్యకు గురయ్యారు. 

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. 

సుక్మా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్కల్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. చేతబడి వల్ల ఓ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడన్న అనుమానంతో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

‘నీట్’ సెగ: తండ్రిని కాల్చి చంపి.. ముక్కలు చేసి డ్రమ్ములో కుక్కిన కొడుకు!

Ram Narayana

అమెరికాలో విషాదం.. భారత సంతతి సంపన్న కుటుంబం ఆత్మహత్య?

Ram Narayana

అసెంబ్లీ ముట్టడికి పలుసంఘాల ప్రయత్నం …లాఠీచార్జి ,అరెస్టులు.. ప‌రిస్థితి ఉద్రిక్తం…

Drukpadam