తెలంగాణ వార్తలు

గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి సోమవారం మంత్రి తుమ్మల…!

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో రేపు సోమవారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు.

షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాడు జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన స్వంత జిల్లా నిజామాబాద్ జిల్లా లో పర్యటించడం తో వాయిదా పడిన విషయం తెలిసిందే.

కాగా ముందుగానే ప్రకటించినట్టుగా సోమవారం నాడు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. కాగా ఇప్పటికే మొదటి రోజు వైద్య, ఆరోగ్య శాఖ దామోదర్ రాజా నర్సింహ గారు, రెండో రోజు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు..

Related posts

పోరు ఉత్కంఠమా …?వన్ సైడేనా …??

Ram Narayana

హైదరాబాద్ లో బెగ్గర్ ఆదాయం ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… ఎందుకంటే?

Ram Narayana