Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఆప్తమిత్రుడు బొప్పన గాంధీ కి ఘన నివాళ్లు అర్పించిన మాజీ ఎంపీ నామ

ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి బొప్పన గాంధీ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ మాజీ లోక్‌సభపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. చిరకాల మిత్రుడిని కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధిలో గాంధీ చేసిన కృషి మరువలేనిదని, పరిశ్రమను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర విశేషమని అభినందించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మృతి చెందిన బొప్పన గాంధీ భౌతికకాయాన్ని గురువారం నాడు ఖమ్మం నగరంలోని బ్యాంకు కాలనీలోని సృజన అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారి నివాసానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు, నామ సోదరుడు శీతయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ కుటుంబ సభ్యులను నామ పరామర్శించి, ఆప్తమిత్రుడి పాడే మోసి తమ మధ్య ఉన్న స్నేహ బంధం ఎలాంటిదో చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు, నామ కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, గ్రానైట్ యజమానులు, బొప్పన గాంధీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Related posts

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్

Ram Narayana

మంత్రి తుమ్మలకు శుభాకాంక్షల వెల్లువ …జనంతో కిక్కిరిసిన శ్రీసిటీ …

Ram Narayana

కబ్జాలు లేని ఖమ్మం అభివృద్దికి కట్టుబడి ఉన్నా:మంత్రి తుమ్మల…

Ram Narayana

Leave a Comment