అంతర్జాతీయం

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నివాసంపై డ్రోన్ దాడి!

  • అత్యాధునిక గగనతల రక్షణను దాటుకొని వచ్చిన డ్రోన్
  • దాడి సమయంలో ఇంట్లో లేని ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య
  • నిర్ధారించిన ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు

హిజ్బుల్లా స్థావరాలను సమూలంగా ధ్వంసం చేయడం లక్ష్యంగా లెబనాన్‌లో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసం టార్గెట్‌గా డ్రోన్ దాడి జరిగింది. కీలకమైన ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు కూడా నిర్ధారించారు. సిజేరియాలో ఉన్న ప్రధాని నెతన్యాహు ఇల్లు లక్ష్యంగా డ్రోన్‌ను ప్రయోగించారని, అత్యాధునిక గగనతల రక్షణను దాటి మరీ ఈ డ్రోన్ వచ్చిందని అధికారులు తెలిపారు. లెబనాన్ నుంచి ఈ డ్రోన్‌ను ప్రయోగించారు.

కాగా దాడి ఘటన జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, అతడి భార్య ఇంట్లో లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు. కాగా లెబనాన్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Related posts

చికాగోలో కాల్పుల కలకలం .. నలుగురి మృతి, 14 మందికి గాయాలు

Ram Narayana

అమెరికా వీసా ఇంటర్వ్యూలకు కొత్త చిక్కు.. ఇక సోషల్ మీడియాపైనా నిఘా.. భారతీయ నిపుణులపై ప్ర‌భావం?

Ram Narayana

దేశంలో ఆకలి కేకలంటూ అంతర్జాతీయ నివేదిక.. భారత్ గుస్సా!

Ram Narayana