జాతీయ వార్తలు

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!

  • 19వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
  • 9.7 కోట్ల మంది రైతులకు రూ.22 వేల కోట్లను విడుదల చేసిన కేంద్రం
  • ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.6 వేలు

రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం-కిసాన్ నిధులు సోమవారం జమ అయ్యాయి. పీఎం కిసాన్ యోజన కింద 19వ విడత నిధులను ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా రూ.22 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. ఈ నిధులతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో విడత రూ.2 వేల చొప్పున ఏడాదికి మూడు విడతలు మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

Related posts

పాన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!

Ram Narayana

ఐజీ హోదాలో ఉన్నా తప్పని కుల వివక్ష.. ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ లేఖలో సంచలన విషయాలు!

Ram Narayana

బెంగళూరులో వైరల్ గా మారిన టూలెట్ ప్రకటన.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు!

Ram Narayana