- నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సుబ్బారెడ్డి మాతృమూర్తి
- మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన జగన్
- సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె వయసు 85 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె… ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పిచ్చమ్మ పార్థివదేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు.
బాపట్ల జిల్లా మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించి, వైవీ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియల్లో జగన్ పాల్గొనబోతున్నారు.