Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివదేహానికి నివాళి అర్పించిన జగన్…!

  • నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సుబ్బారెడ్డి మాతృమూర్తి
  • మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన జగన్
  • సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె వయసు 85 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె… ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పిచ్చమ్మ పార్థివదేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. 

బాపట్ల జిల్లా మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించి, వైవీ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియల్లో జగన్ పాల్గొనబోతున్నారు.

Related posts

ప్రధాని మోదీ ఇంట్లో ఒక పాపకు సుష్మా స్వరాజ్ పేరు.. అదెలా పెట్టారంటే…!

Drukpadam

ఇక ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్.. అన్నీ ఒకే డిజిటల్ ఐడీలో!

Drukpadam

చిరంజీవి గారూ, మీ ఇంట్లో వివాదాలు లేవా?… మీ తమ్ముడికి చెప్పండి: అంబటి రాంబాబు…

Ram Narayana

Leave a Comment