తెలంగాణ రాజకీయ వార్తలు ..

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ: కీలక అంశాలపై సమాలోచనలు!

  • ఒకట్రెండు రోజుల్లో టీపీసీసీ కార్యవర్గ ప్రకటన
  • ఢిల్లీలో రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ భేటీ
  • రాష్ట్ర కేబినెట్‌లో బీసీలకు తగిన స్థానం కల్పించాలని విజ్ఞప్తి
  • కేబినెట్ కూర్పుపై త్వరలో నిర్ణయమన్న రాహుల్

టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని రాబోయే ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు.

మహేశ్‌కుమార్‌ గౌడ్ తన అర్ధాంగితో కలిసి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కేబినెట్‌లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తాను రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారని, కేబినెట్ కూర్పు విషయంలో త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన అనేక రాజకీయ, అభివృద్ధి అంశాలపై తాము చర్చించినట్లు మహేశ్‌కుమార్‌ గౌడ్ వివరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ‘జై బాపు – జై భీమ్’ వంటి కార్యక్రమాల గురించి కూడా రాహుల్ గాంధీకి వివరించినట్లు ఆయన తెలియజేశారు.

Related posts

మంత్రులు చేపకూరతో విందులు చేసుకుంటున్నారు: కేటీఆర్ విమర్శలు

Ram Narayana

తుమ్మలకు సిపిఐ (ఎం ఎల్ )ప్రజాపంథా మద్దతు ….

Ram Narayana

సినీ పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దు: కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజు రియాక్షన్!

Ram Narayana