కోర్ట్ వార్తలు ...

హైకోర్టులో బండి సంజయ్‌కు స్వల్ప ఊరట .. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

  • పాత కేసుల కొట్టివేతకు బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు
  • కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే హరీశ్ బాబు పిటిషన్లు
  • బండి సంజయ్, హరీశ్ బాబులకు వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం
  • ఎంపీ లక్ష్మణ్ కేసులను మరో ధర్మాసనానికి మార్చాలని రిజిస్ట్రీకి సూచన
  • విచారణను జూలై 17వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం

తమపై గతంలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే హరీశ్ బాబు వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, బండి సంజయ్‌, హరీశ్ బాబులకు ఊరట కల్పించింది. కింది కోర్టుల్లో వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎంపీ లక్ష్మణ్‌కు సంబంధించిన కేసుల విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. అనంతరం, ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 17వ తేదీకి వాయిదా వేసింది.

Related posts

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం.. హైకోర్టులో ప్ర‌భాక‌ర్ రావు పిటిష‌న్!

Ram Narayana

కన్నడ భాషపై మాట్లాడొద్దు .. కమల్ హాసన్‌ను ఆదేశించిన కోర్టు

Ram Narayana

అఫీషియ‌ల్… విడాకులు తీసుకున్న చాహ‌ల్‌, ధ‌న‌శ్రీ వ‌ర్మ!

Ram Narayana